పుట:కాశీమజిలీకథలు -09.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14]

సిద్ధవ్రతుని కథ

105

188 వ మజిలీ

సిద్ధవ్రతుని కథ

రాజపుత్రుని చిత్తము నక్షత్రలోకతాదాత్మ్యము జెందుచున్నది. సంతతము ఆ విషయమే ధ్యానించుచుండును. ఇతరశాస్త్రోపదేష్టలు వచ్చి యుపన్యసింప నాలింపక నక్షత్రవృత్తాంతమే యడుగుచుండు. ప్రవరుం డోషధీరసవిశేషంబున హిమగిరి కరిగిన చరితము సత్యమే! అని పండితుల శంకించుచుండును. నిద్రలో నక్షత్రలోకమున కరిగినట్లు కలలు గనుచుండును. ఇట్లున్మత్తునిక్రియ దదేకధ్యానమున వర్తింపుచు నొకనాడు సిద్ధార్థున కిట్లనియె.

మిత్రుడా? ఇక నాకు విద్యాగ్రహణమునం దుత్సుకములేదు. రాజ్యతంత్రమునం దభీష్టము పుట్టదు. భూలోకవిషయములన్నియు మన మెఱింగినవియే లోకాంతరవిషయములు కన్నులార జూడవలయును. మనము తపంబు సేయజాలము. తపోధనుల శుశ్రూషవలన నట్టిశక్తి సంపాదింపవలయును. మన సత్రము ప్రక్కనున్న మఠమునకు నిత్యము వచ్చుచుండెడి సన్యాసుల బైరాగుల నవధూతల బరివ్రాజికుల నాశ్రయింపుచుండవలయును. అందఱు గపటాత్ములుగారు. నూటికొక్కడైన మహానుభావు డుండకపోడు. మహర్షులు లోకరక్షణార్ధమై దేశసంచారము సేయుచుందురు. మఠమునకువచ్చు విరక్తులకు విశేషముగా ధనమిచ్చుచుండవలయును. మాతండ్రిగారి కీరహస్యము దెలియనీయగూడదని చెప్పిన విని సిద్ధార్థుండు నవ్వుచు వయస్యా! గట్టిపట్టే పట్టితివి. అందరానిపండ్ల కాసపడుచుంటివి. కానిమ్ము దీనం దప్పేమియున్నది ప్రయత్నింతముగాక అని యతండు సెప్పినట్లు కావింపుచుండెను.

రాజపుత్రుడు సిద్ధార్థునితో గూడ నిత్యము మఠమునకుబోయి మహాత్ములని తోచిన బైరాగులతో ముచ్చటింపుచు వారు వారు దిరిగిన దేశవిశేషము లడుగుచు క్షేత్రమహాత్మ్యముల దెలిసికొనుచు విశేషముగా గానుకలు పంచిపెట్టుచుండెను. దానంజేసి పుడమిగల విరక్తులందఱు వేలకొలది యచ్చటికి వచ్చుచుండిరి.

సీ. మెలికలు వారి కొమ్ముల భాతినొప్పారు
              గోళ్ళుబెంచిన యతుల్ గొంతమంది
    పొడవుగా వెనువెన్క మడమలఁ జీరాడు
              జడలు గల్గిన యతీశ్వరులు కొంద
    ఱఖిలాంగముల రుద్రాక్ష మాలికలొప్ప
             భవుపోల్కె నొప్పుతాపసులు కొంద
    ఱవయవంబుల భూతినలఁది యున్మత్తరూ
              పములఁ గ్రుమ్మరు దిగంబరులు కొంద