పుట:కాశీమజిలీకథలు -07.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసువుల కథ

13

    జ్ఞానిధులై జరామరణజవ్యడలాధులు క్షుత్పిపాసలున్
    బూనక దేవభావమునుబొంది సుఖింతురనేక ఘన్రముల్.

తమ్ములారా ! ఇది యరుంధతీ మనోహరుండైన వసిష్ఠమునీంద్రుని హోమదేనువు కశ్యపుని వలన సురభియను భార్య యందు జనించినది. దీనిపాలంగ్రోలినవారు క్షుత్పిపాసలు జరావ్యాధులు లేక యనేక వత్సరంబులు జీవింతురు. దీనికతంబున నీయాశ్రమంబు వసిష్ఠ మహర్షి దని దెలిసికొంటిమి అమ్మహాత్ముం డలిగిన మూడులోకములు దృటిలో భస్మీభూతములై పోఁగలవు. మనమిఁక నిందు మసలరాదు. పోవుదము రండని పలికిన విని వారెల్ల బ్రయాణోన్ముఖులైరి.

అట్టితరి యోగనక్త యప్పలుకులాలించి ప్రభాసుని పాదంబులకరగి యిట్లనియె ప్రాణేశ్వరా ! నా ప్రాణసఖి జితవతి యుదంతంబింతకు ముందు మీకెఱిగించితినిగదా !

అన్నరనాధకన్యకకు మానవదుర్ల భమగు దేవభావము గలుగఁజేయుదు నని వరంబిచ్చి వచ్చినమాట మీరును మఱువకుందురు. అయ్యువతీమణి కామితంబీడేర సౌరభట రక్షితంబగు నమృతంబెట్లొ మీచే సంగ్రహింపఁజేసి యవ్వాల్గంటికీయ సంకల్పించుకొని యుంటి. దుర్ఘటకార్యంబు సులభక్రియా సాధ్యంబగుచుండ సుపేక్షింపరాదు గదా ! ఈగోదుగ్ధము లమృతతుల్యంబులని తెలియఁబడినది. ఇప్పుడీ మొదవును మన సదనమునకుఁ దీసుకొనిరావలయును. పాలను బితికి జితవతి కంపెదను. ఇదియే మదీయవాంఛితము ఇక్కామ్యంబుదీర్పక తీరదని మిక్కిలి వినయముతో ధరుఁడు వినమనోహరునిఁ బ్రార్థించినది.

అప్పుడు ప్రభాసుండు అన్నా ! ఈయోగసప్తలుకులు వింటిని గదా. ఇమ్మత్తకాశిని యెన్నడును రిత్తమాట లాడునదికాదు. పరమార్థమెఱింగిన ప్రోఢ పరోపకార తంత్ర. దీనికోరికఁ దీరుపక తప్పదు కావున నీగోవుం బట్టుఁడు తీసికొనిపోవుదమనుఁడు ధరుం డిట్లనియె.

తమ్ముఁడా ! బ్రహ్మర్షివరేణ్యుండైన వసిష్ఠుని హోమధేనునని యెఱింగియు దీనిం బట్టుమనుచుంటివేమి? బ్రాహ్మణవిత్తంబులు హరింపఁ బాతకంబుగాదా? అది యట్టుండ నయ్యతివతి ప్రభావంబు త్రిలోక విదితము, ఇంతదనుకఁ జేసినపనియే తప్పు వనభగంబున కేమి మూడునో యని వెఱక్షుచుంటిని పైపెచ్చు చిచ్చుమూటఁ గట్టుకొనినట్లీ ధేనువుం దీసికొనిపోతిమేని ప్రమాదము రాకమానదు. అమ్ముని వరుచే యాగ్రహంబునకుఁ బాత్రులమైతిమేని రక్షించువా రెవ్వరు? వలదు వలదు పోవుదము రమ్ము అని మందలించిన విని ప్రభాసుండిట్లనియె.

చాలుచాలు పిరికిమాటలు విడువుము వేల్పులఁ బ్రసన్నుల జేసికొనుటకేకాదా?