పుట:కాశీమజిలీకథలు -01.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

    సభ మెచ్చి తొలుఁదొల్త సంతసంబున భర్మ
                   వలయోర్మికాదిభూషల నొసంగె
    నల్లంతదవ్వున నరసి నన్నసదు న
                   వ్వెసఁగ మన్నించుఁ దానే ప్రభుండు
    జనులెల్ల మెచ్చ నేసాధువు సద్వృత్తి
                   యమరంగ నధికార మాచరించెఁ

గీ. గృతియనం గడు కుతుక మే పతికి నట్టి
    సామినేని కులాంబోధిచంద్రుఁడైన
    నారసింహున కీప్రబంధంబు కృతినొ
    సంగఁ దలఁచితి మతిఁగృతజ్ఞత దలిర్ప.

ఉ. అంబుజనాభుపద్వనరుహంబునఁ బుట్టిన వంగడంబులో
    నం బరమప్రభావమున నల్వువహించిన సామినేని వం
    శాంబుధి నుద్భవించిరి గుణాకరు లాశ్రితజాతపారిజా
    తంబులు వంశచంద్రులు వదాన్యమణు ల్పురుషాగ్రణు ల్మహిన్.

క. గోపాలరావు తత్కుల
    దీపకుఁడై యుదయమందె దీనప్రజర
    క్షాపరతంత్రుం డగుచుఁ బ్ర
    తాపకృపాశీలసంస్తుతవ్రతుఁ డగుచున్.

మ. గురుతేజోమహిమంబునం దనరు నా గోపాలరా వర్చితా
     మరసీమంతవతీకదంబయగు నమ్మాణమ్మయందు న్మనో
     హరచేతోగుణశీలశాలి నరసింహాఖ్యాప్రవిఖ్యాతు శ్రీ
     కరనారాయణపాదపద్మనిరతుం గాంచె న్సుతు న్సద్ర్వతున్.

చ. ఘనమతియైన తల్లి పసికారున నుగ్గున రంగరించి యా
    తని నునుబొజ్జలో సుగుణతారజ మొయ్యనఁ బోయఁబోలునే
    ర్పున మఱి కానిచోఁ గొరత బూనక బాల్యమునుండియుం దిరం
    బున నరసింహునందు గుణపుంజము లాగతి నుండనేటికిన్.

సీ. అధికారగర్వ మింతైనఁ జెందఁడుకదా
                     బాలురతోనైనఁ బలుకుచుండు