పుట:కాశీమజిలీకథలు -01.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

    భవభూతి యయ్యు దర్పమును సేయఁడుకదా
                         యాహారశయ్యావిహారగతుల
    నొవ్వనాడఁడుగదా నోరెత్తి పరిచార
                         కుల నైన నపరాధముల గణించి
    పరిహాసమునకైనఁ బలుకనేరఁడుగదా
                         పరుషతీవ్రాసత్యభాషణముల

గీ. సదయు డనురాగగుణవర్తి శాంతమూర్తి
    నిత్యసత్యవ్రతుం డతినిర్మలాత్ముఁ
    డతని కాతండె సాటి యౌరా యటంచుఁ
    బొగడుచుందురు నరసింహు భూమిప్రజలు.

గీ. సాత్వికం బచ్చముగఁ దీసి శాంతరసము
    పదునుపడఁబోసి నెనరుతో మెదిపి దాన
    వానిమతి జేసె భారతీజాని, కాని
    నాఁడు నిల్చునె యన్నిగుణంబు లచట.

మ. నరులెల్లం దనశాంతభావమును నానాభంగి గీర్తింపఁగా
     నురుకీర్తిప్రభుతానురక్తిగల యుద్యోగంబుతో ధర్మత
     త్పరుఁడై యొప్పెడువానికిం బొడమునంతం దల్లిదండ్రుల్ భళీ
     నరసింహంబని పేరుపెట్టుట బుధానందంబుగాదే తుదిన్.

క. ఆతని యర్ధశరీరము
   పాతివ్రత్యప్రభావపరిహసితసతీ
   వ్రాతవినిర్మలమతి వి
   ఖ్యాతసుగుణ సుందరమ్మ యనఁ బొల్చుఁ దగన్.

సీ. పరుల నెన్నఁడు నోటఁ బరుషంబుఁ లాడదు
                      అలుగదు దాదులయందునైన
    పెద్దలఁ బొడఁగన్నఁ దద్దయు భయభక్తి
                      వినయవిశ్వాసము ల్బెనఁగొనంగ
    నమ్రయై మ్రొక్కి చెంతకుఁ జేరి తద్విశే
                      షములెల్ల నల్లన సంగ్రహించు