14
కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము
గీ. యెన్నఁడే నుండుగాలంబు మిన్న చిక్కు
భూతములుగ్రాలు నెన్నఁడే బుట్టినిండ్ల
నపుడు వారణసీక్షేత్రమైదు క్రోసు
లంతమేర యుపద్రవం బందకుండు.
అట్టి కాశీక్షేత్రంబును విడచి, భాగీరథీపుణ్యస్రవంతికా నిర్మల వారిశీకర ప్రసారశీతలవాతపోతంబుల సుఖంబుమరచి యనవరతమోక్షదిదృక్షాగత భక్తసందోహ సమర్పితస్తుతిపూర్వక వందన చందనానులేపనోపహార సమయాగతానందంబెల్ల బోఁద్రోచిఁ సర్వభోగంబులఁద్యజించి, యెచ్చటనో తలఁగాచుకొనవలెనన్న గష్టము గాకుండునా ? కాని లోకసంరక్షణార్థము నీవు నిర్ణయించిన దానిని మేమును మన్నింపవలయుఁ గావున నీయిచ్చవచ్చినమచ్చున నొనరింపుము. దివోదాసుని భూరాజ్యపట్టభద్రునిగాఁ జేయుము. వానికోరికవడుపున నేను సపరివారంబుగ నెందేనిఁ బోయెదంగాకయని యమ్మహాదేవుండానతిచ్చుటయు మనంబున సంతసించి యవ్వి రించి దివోదాసుని సర్వవసుంధరా చక్రంబున కేలికఁగా నియమించి నిజనివాసంబున కఱిగె.
302వ మజిలీ
దివోదాసుని కథ
అంత దివోదాసుండు మహావైభవంబున ధరారాజ్యాభిషిక్తుండై కాశీపురంబు నిజరాజధానిగాఁ జేసికొని ప్రజాసంరక్షణైక దక్షుండై యుండెను మఱియును --
శా. చాటించెన్ మనువంశవర్దనుఁడు విశ్వక్షోణి నందంద ఘం
టాటంకారము దుందుభిధ్వనియుఁగూడన్ వేగమై దేవతా
కోటుల్మేదిని నన్నుఁదప్పగుఁజుఁడో! కోపంబుపాపం బుపా
త్తాటోపంబుమెయిం గుటుంబ సహితంబై చేరుఁడోనాకమున్.
క. పాతాళమునకు జనరో
వాతాళను లెచటికేని వలసిన యెడకున్
భూతము లేగరొయని య
త్యాతతగతిఁ జాటిరవని నధిపతి దూతల్.
ఇవ్విధంబున భూతలంబునంగల సకలపుణ్యక్షేత్రంబులయందుఁ జాటింపు చేయించినతోడనే బ్రహ్మదత్తవర ప్రభావంబునఁ కాశీగయా ప్రయాగ, జగన్నాథ,