పుట:కాశీమజిలీకథలు-12.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


312 వ మజిలీ

అరిందమునికథ

నాఁటి సాయంకాలము భైరవీదేవి యాలయ ప్రాంగణమున కొక యక్ష కుమారుఁ డరిందముఁడనువాఁ డొకపరిచారకునిచేత పెట్టె నొకదానినిఁ బట్టించుకొని వచ్చి యందుఁబెట్టించి వానిఁబంపివేసెను. పిదప నతండా మందరము నొకప్రక్కకుఁ ద్రోసి యాదేవి విగ్రహము ముందుఁ జక్కఁగా నలికి చిత్రచిత్రములగు మ్రుగ్గులం బెట్టి వలయువస్తు సంచయమునెల్ల నాయత్తము జేసికొని యిఁక‌ నుపాసనకుఁ గడంగ వచ్చునని యనుకొనుచుఁ జేరువనున్న కాసారంబునకు స్నానార్థ మరిగెను.

వానిపోకడఁ గనిపెట్టి యా దేవీవిగ్రహము వెనుకనున్న యొక వ్యక్తి యీవలకువచ్చి యా పెట్టెలో నేమున్నదోయని దాని మూతను బై కెత్తి చూచెను. అందుఁ దై లావలిప్తసర్వాంగముగానున్న యొక మృతబాలక కళేబరము గనంబడినది. అదియెయ్యదియో తైలముతోఁ దడపఁబడియుండుటచే నించుకైనను రూపము మారక యప్పుడే ప్రాణములఁ బాసినట్లుండెను. దానింజూచినతోడనే యా వ్యక్తికి హృదయం బున నపరితోత్సాహ మంకురించినది. ఆ వ్వక్తి యెవ్వరుఁ మన దివోదాస మహారాజు గారే ! గుణవతి యంతఃపురమునఁ జిత్రలేఖ వలన నరిందముని ప్రయత్నము సర్వము నెరింగి యాశబరబాలక శవంబు నెట్లయిన సంగ్రహింపనెంచి యా భైరవీదేవియాల యంబునకు ముందుగాఁబోయి యాశ క్తి విగ్రహము వెనుకఁ డాగియుండెను.

ఆ మందసములోనున్న శవమును జూచినతోడనే వాఁడు బ్రతికినట్లుగానే సంతసించెను. ఎవ్వానిని బ్రతికించుటకుఁ బ్రతిన దాల్చి సర్వరాజ్య భోగ్యములఁ ద్యజించి తిరుగుచుండెనో యెవ్వానిదేహాన్వేషేణంబు నిమిత్తముగా లోకాంతరముల కఱిగెనో యట్టి శబర బాలకుని శరీరముగా దానిని నిరూపించి మరల నమ్మందసము నెప్పటియట్ల భద్రపరచి తనపూన్కె నెరవేర్ప నయ్యమ్మవారిని భక్తిపురస్సరముగా నిట్లు నన్ను సన్నుతించెను.


చ. కడుపునఁబెట్టికొంచు, ద్రిజగంబులఁదోషణ సేయుతల్లి వీ
    వుడుగక జీవహింసలను నోర్పెదవొక్క ! వ్రతంబుపేర ని
    ట్లెడపక ప్రాణహత్య లొనరించుదురాత్ములు నీకుభక్తులే ?
    పడయఁగలరెవారలుశుభంబుల నేవిధినైన నమ్మరో !

చ. ధరణికిచ్చి నానియతిఁ దప్పుటెగాక వనాటబాలకున్
    బొరిఁగొనివాని దేహమునుమ్రుచ్చువలెన్‌ గొనివచ్చి యిచ్చటన్‌