శ్రీ శంకరాచార్య చరిత్రము
77
ఇంకొకతె.
గీ. నిత్యమో లేక లోక మనిత్యమో య
టంచు సందియమందుచు నరయనెందు
ద్వారనీడాంతరస్థితకీరచయము
పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.
అని పలికి యరిగిన యమ్మగువుల మధురోక్తి విశేషముల కలరుచు శంకరుం డరిగి యరిగి మరియొకచో భూరికవాటగుప్తమగు తన్మందిరము గనుగొని ప్రవేశింప శక్యము కాకుండుట దిలకించి శిష్యుల నందుండ నియమించి యోగశక్తిచే గగనమార్గంబున లోనికింజని తదంతర్భవనంబు బ్రవేశించెను.
అట్టి సమయంబున మండనపండితుండు శ్రాద్ధవిధియందు వ్యాసజైమిని మునులు భోక్తలుగా నియమించు వారికి గాళ్ళు కడుగుచున్నవాడు గావున జ్ఞానశిఖోపవీతుండై యరుదెంచిన యయ్యతిపతిం గాంచి ప్రవృత్తిశాస్త్రైకరతుండగుటచే సన్యాసి యని మిగుల గోపించుచు నిట్లు సంవాదము గావించెను.
శంకర మండనమిశ్రుల సంవాదము
మండనుఁడు — కుతోముండీ! సన్యాసి! యెచటనుండి వచ్చుచుంటివి?
దానికి ముండన మెంతవరకను నర్థముం జేసికొని.
శంక - ఆగశాన్కుండీ నేను కంఠమువరకే ముండిని అనఁగా క్షౌరముఁ జేయించుకొందును.
మండ — తేపంధామయాపృచ్ఛ్యతే? అదిగాదు నాచే నీ మార్గ మడుగ బడుచున్నది. తెలిసికొనలేవేమి?
శంక - కిమాహాకంధాః? పరియే ? మార్గమేనని నీ కుత్తరం మిచ్చినది?
మండ — [కోపముతో ] త్వన్మా తాముండేతి. నీ తల్లి ముండయని చెప్పినది.
శంక — తదైవహి. బాగు బాగు. నీవు మార్గము నడిగినందులకు నీ తల్లి ముండయని నీకు మంచియుత్తరమే చెప్పినది.
మండ - సురాపితాకిము ! పిచ్చిమాటలాడుచున్నావు కల్లు ద్రాగితివా యేమి?
శంక — [పీతా అను పదమునకు "పచ్చన" అని యర్ధముఁజేసి] నహి నహి శ్యేతాస్మర. కల్లు పచ్చగానుండదు. దెల్లగా నుండును. జ్ఞాపకము తెచ్చుకొనుము.