పుట:కాశీమజిలీకథలు-05.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సుమతి - అవును. ఆశ్రమమున వారిని శాస్త్రములలో నిరుత్తరులం గావించి తప్పులు దిద్దెను.

గుణవర్మ - ఆహా! శంకరుని విద్యార్ధియనియు, బాలుండనియు సామాన్యునిగాఁ దలంచుచుందురు. విద్యామూర్తి యని యెరుంగరు. వీనిలో దైవశక్తి యున్నది సుమీ. కాకున్న వీని ప్రాయమెంత? విద్యయెంత?

సుమతి — ఈతండు మనుష్య మాత్రుఁడుకాఁడు. అవతారమూర్తి యనియే తలంపవలయు. నిశ్చయము. ప్రసంగము గావించినపుడు వీని వదనమునుండి శబ్దజాలము గంగాప్రవాహమువలె గలగల ధ్వనితో నూరక మొలచుచున్నట్లే బయలు వెడలును గదా.

శ్లో॥ నృత్యద్భూతేశవల్లమ్మకుటకటత్స్వర్దునీ స్పర్దినీ భి
      ర్వాగ్బిర్నిర్బిన్నకూలోచ్చలదమృతసరస్సారిణీధోరణీభిః
     ఉద్వేలద్వైతవాది స్వమతపరిణతాహంక్రియాహుంక్రియాభి
     ర్బాతి శ్రీశంకరార్యస్సతతముపనిషద్వాహినీగాహినీభిః.

గుణవర్మ — మనకు శంకరుని సహాధ్యాయులమని చెప్పుకొనుటయే ప్రతిష్ఠ గదా అదిగో మనరామభట్టీలాగున వచ్చుచున్నాఁడు చూచితివా.

సుమతి — మనకొఱకే కావచ్చు.

రామభట్టు — [ప్రవేశించి] మిత్రులారా! యిందేదియో మంతనమాడు చున్నారే.

సుమతి — మఱేమియులేదు. నిన్న శంకరుఁడు గావించిన యద్భుతచర్యల వీరితోఁ జెప్పుచున్నాను.

రామభట్టు - నీవు శంకరుని మహిమ యెరుంగక వానితో వాదమునకుఁ బూనుకొంటివి. దానికి గురువులు నిమిత్తమాత్రులుగాని వాఁడు విద్యార్ధికాఁడు వాని మహిమ నేనంతకుఁ బూర్వమే యెరుంగుదును.

శ్లో॥ అజ్ఞానాంతర్గహనపతితానాత్మవిద్యోపదే శై
     స్త్స్రాతుంలోకాన్బవదవశిఖాతాపసాపచ్యమానాన్
     ముక్త్వామౌసంవటవిటపినోమూలలో నిష్పతంతీ
     శంభోర్మూర్తిశ్చరతిభువనెశంకరాచార్యరూపా.

అజ్ఞా నారణ్య మధ్యంబునంబడి పుత్త్రస్త్రీధనవశవియోగ సంతాపముగల సంసారదవానలంబునఁ బరితపించెడు జనులకు నాత్మ విద్యోపదేశముచే రక్షింపనవతరించిన శంభుమూర్తియని నమ్ముము.

సుమతి — సందేహమేల! ఆ మాటయే నేను వీరితోఁ జెప్పుచున్నాను.

రామభట్టు - నిన్న యుదయమున జరిగిన యద్భుతము నీవు వింటివా.