శ్రీ శంకరాచార్య చరిత్రము
129
ఈపాదౌయథాభేదతాసన్మణీనాం
తథాభేదతాబుద్ధిభేదేషుతేపి
యథాచంద్రికాణాంజలే చంచలత్వం
తథాచంచలత్వంతవాపీహవిష్ణోః12
పరమాత్మతత్త్వమును హస్తామలకములభంగి నీ శ్లోకములు దెలుపుటచే వీనికి హస్తామలకశ్లోకంబులని వాడుక వచ్చినది. మఱియు నిట్టిశ్లోకంబుల నుపదేశము లేకయే రచించుటచే నా బ్రాహ్మణకుమారునికిని హస్తామలకుడని పేరు వచ్చినది. అట్టి శ్లోకంబులం జదివి యా బ్రాహ్మణపుత్రుండు తన యింటికిం జనియెను. అంతకుబూర్వ మక్షరమైనం దెలియని యత డట్లు శ్లోకములు రచించుట జూచి యెల్లరు విస్మయమును జెందుచు నది శంకరాచార్యుని యనుగ్రహలాభమని నిశ్చయించిరి. తరువాత శంకరాచార్యుడు ప్రభాకరునిం జూచి, "ఆర్యా! నీ కుమారుండు నీయొద్ద నుండ నర్హుండు కాడు. వీనితో నీకేమి ప్రయోజనమున్నది? వీడు పూర్వభవాభ్యాసవశంబున సర్వము నెరుంగును. ఎరింగియే లోకమునకు గల యజ్ఞానమును గురించి చింతించుచు నిట్లు జడునిభాతి గ్రుమ్మరియెను. వీనికి గృహాదికమందు మమత్వము లేదు. తన శరీరమునే యెరువుగా జూచుకొనుచుండ బాహ్యవస్తువుల మాట జేప్పనేల? వీడు నీ కేమియు నుపచరించడు. వీని నే దీసికొనిపోయెదం బంపు" మని పలికిన విని ప్రభాకరుండు సంతసించుచు దన కుమారుని రప్పించి శంకరునికి శిష్యునిగా నప్పగించెను శంకరాచార్యుండును వానికి హస్తామలకుండని పేరు పెట్టి బ్రహ్మభావ ముపదేశించి తన ప్రధానశిష్యులలో జేర్చికొనియెను. బదంపడి యతం డచ్చోటు గదలి క్రమంబున నరిగియరిగి.
సీ. తుంగభద్రానదీతుంగతరంగశీ
తలమారుతప్రమోదప్రదంబు
దర్శనమాత్రవిధ్వంసితాఖిలఘోర
పాతకం బమృతసంపాదకంబు
అభ్యాగతజనార్చనార్పితమందార
పాదపంబు తీర్థపాదపంబు
అద్వైతవిద్యారహస్యజ్ఞ గురుతపో
ధనజనాంచితము బాధారహితము
గీ. ఋష్యశృంగమహాతాపసేంద్ర భూరి
తరతిపఃపావనంబు సుందరవనంబు