పుట:కాశీఖండము.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

488

శ్రీకాశీఖండము


దేవుఁడు చెట్టునఁ బుడికిన
భావంబున నుండు రూపు ప్రాయము కలిమిన్.

234


తే.

ద్వారవతి గంగమట్టి హస్తమునఁ గరఁచి
ఫాలమున నూర్ధ్వపుండ్రంబు పట్టె దీర్చి
యుభయదర్భలు ధరియించి యుదయవేళ
గంగదరి నుండు దానాభికాంక్ష నతఁడు.

235


ఉ.

ఏమని చెప్పఁ గాశిపురి నెందును సంకుచితాగ్రహస్తుఁడై
భూమిసురుండు దానములు పుచ్చుకొనండు దరిద్రుఁ డయ్యు నే
నేమఱుపాటునం గనిన నేటితటంబున నర్థకాంక్షఁ బే
రాముదపాకునట్ల తనహస్తము విచ్చియయుండువానికిన్.

236


తే.

ఇవ్విధంబున బ్రాహ్మణుం డేపు రేగి
తిరుగుచుండఁగఁ బెక్కువత్సరము లరుగఁ
గలుగుదురు పుత్రు లిద్ద ఱక్కాలమునకుఁ
గుండగోళకశబ్దంబు కొనలు సాగ.

237


వ.

అక్కాలంబునం దొక్కచండాలుండు బహుధనాఢ్యుండు వింధ్యపర్వతదేశవాసి తీర్థయాత్రాప్రసంగంబునం గాశి కేతెంచి చక్రపుష్కరిణీహ్రదంబునఁ దీర్థం బాడి యార్ద్రవస్త్రధరుండై దరి కేతెంచి నలుదిక్కులం జూచి యుచ్చైస్స్వనంబున.

238


శా.

చండాలుం డను వింధ్యభూధరమహాసానుస్థలీపక్కణ
స్థుండం గాశికి వచ్చి సిద్ధతటినీతోయంబులం గ్రుంకితిన్
వెండియుఁ బైఁడియుఁ వెచ్చినాఁడఁ గలఁడే విప్రుండు విద్యాసము
ద్రుం డీయర్థము వాని కేను బితృసంతోషార్థమై యిచ్చెదన్.

239


తే.

అనిన విని భూసురోత్తము లద్దిరయ్య!
కాశి యఁట గంగ యఁట మణికర్ణిక యఁట