పుట:కాశీఖండము.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

489


విశ్వపతి యఁట యవిముక్తవిహృతిభూమి
మాలచే దారగొనెడు బ్రాహ్మణుఁడు గలఁడె?

240


తే.

అనుచుఁ జేతులఁ గర్ణంబు లదిమికొసుచుఁ
బోవనున్నారు నది నున్న భూమిసురులు
చూపనున్నాఁడు వ్రేల భూసురుఁ డొకండు
సాహసికుఁడు మహానందు సన్న సేసి.

241


సీ.

ప్రార్థింపసున్నాడు పాదాబ్దముల వ్రాలి
        వెలివాడవాఁడు తద్విప్రకులుని
మేల్కొననున్నాఁడు మిథ్యాసమాధి న
        క్కపటధార్మికుఁ డప్డు కన్నుఁ దెఱిచి
ప్రణుతింపనున్నాఁడు బ్రాహ్మణబ్రువు మాల
        కేల్దోయి నొసలిపైఁ గీలుకొలిపి
దీపింపనున్నాఁడు దెలిసి దోహరిబంటు
        చెవి నక్షమాలిక చెరివి ద్విజుఁడు


తే.

ప్రబలత భక్తి నీరీతి బ్రస్ఫుటముగ
వివిధదంభంబు లిబ్భంగి విస్తరిల్ల
నంత్యజుండును నగ్రజన్మాధముండు
గంగదరిఁ దీర్తు రుచితసత్కారవిధులు.

242


వ.

అనంతరంబ పరద్రవ్యజిహీర్షాలోభగ్రహగ్రస్తు డైనయయ్యగ్రజన్మాధముండు చండాలునిం గటాక్షమున వీక్షించి నిస్పృహత్వంబు నటించుచు.

243


తే.

ఆస లేదు ధనంబుపై నంత్యజన్మ!
చాలు యాయావరము శిలోంఛంబు మాకుఁ