పుట:కాశీఖండము.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

461


        నరుణోదయము గానియటక మున్న
గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున
        నఘమర్షణస్నాన మాచరించి
యరుణాంశుమండలం బర్ధోదయమునొందు
        సమయంబు వీక్షించి సంధ్య వార్చి
నిలుచుండి జపియించి నియతితో గాయత్రి
        సంఖ్య యష్టోత్తరశతము గాఁగ


తే.

నగ్నికార్యముదీర్చిఁ గామారిఁ గొల్చి
ముక్తిమంటపికామధ్యమునఁ బఠించె
శివపురాణంబు మధ్నాహ్నసీమదాఁక
నపరనారాయణుఁడు బాదరాయణుండు.

132


మ.

ఝటితిస్యూతపలాశపత్రపుటికాశాటీప్రసేవంబులున్
ఘటముల్ తామరపాకులున్ గుహళులున్ గండోలముల్ పూని బా
సట వేదంబుఁ బఠించుచుం గదిసి వైశంపాయనాదుల్ సము
త్కటభంగిం గొలువంగ నేగె ముని భిక్షాకృత్యయాచ్ఞార్థమై.

133


తే.

నెట్టుకొని కాయు బిఱ్ఱెండఁ బట్టపగలు
తాను శిష్యులు నింటింట దప్పకుండఁ
గాశికావిప్రగృహవాటికలఁ బొనర్చె
నఖిలవిద్యాగురుండు భిక్షాటనమును.

134


శా.

ఛాత్రుల్ పైలసుమంతజైమినులువైశంపాయనుం డాదిగాఁ
బాత్రంబుల్ ధరియించి యన్నిదెసలన్ భైక్షంబు వేడంగ న
క్షత్రాధీశ్వరమౌళిపట్టణమునం గాశిం దలంప న్మహా
చిత్రం బోగిర మబ్బదయ్యె ఋషికిం జేకూరదయ్యెం దుదిన్.

135