పుట:కాశీఖండము.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

460

శ్రీకాశీఖండము


భూతి సర్వాంగకంబుల సముద్ధూళించు
        ధరియించు రుద్రాక్షదామకములు


తే.

శ్రుతులు నా ల్గేర్పఱచినట్టి సూక్ష్మబుద్ధి
బ్రహ్మసంవేది యాదిపురాణకర్త
భారతాఖ్యానసంహితా ప్రథమసుకవి
గంధవతిపట్టి యానందకాననమున.

128


వ.

ఇవ్విధంబునం బెద్దకాలంబు కాశీనగరంబునఁ గృష్ణద్వైపాయనుండు శిష్యవర్గంబును దానును నపవర్గపదవీకల్యాణలాభార్థంబు వసియింప నమ్మునిమనస్స్థైర్యంబు పరీక్షింపం దలంచి విశ్వేశ్వర శ్రీమహాదేవుండు విశాలాక్షి కి ట్లనియె.

129


గీ.

బాదరాయణచిత్త మేపాటియదియొ
యరయుదము గాని యతఁడు బిక్షాటనమున
కేగుదెంచినయప్పు డింటింట భిక్ష
కలుగకుండంగఁ జేయంగవలయు నీవు.

130


వ.

అనిన నద్దేవి మహాప్రసాదం బని యఖిలభూతాంతర్యామిని గావున గాశికానగరంబున గృహిణీగృహస్థులయంతరంగంబుల నధివసించి భిక్షాప్రదానప్రతిష్టంభకారణంబై యుండె; నంత కృష్ణద్వైపాయనుండును.

131


సీ.

[1]కాలోచితము లైనకరణీయములు దీర్చి

  1. ‘గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున నఘమర్షణస్నాన మాచరించి
    నిలుచుండి కావించి నియతిమై గాయత్రి సంఖ్య యష్టోత్తరశతము గాఁగఁ
    బఠియించి యప్పుడు పత్రపుష్పములతో శివు నీలకంఠుని సేవ చేసి
    యంతరంగంబున నభవుని నిడుకొని శాంతచిత్తంబున సంధ్య వార్చి
    గీ. యగ్నికార్యముఁ దీర్చి కౌమారిఁ గొల్చి’ అని యొక వ్రాఁతపుస్తకమునఁ బాఠాంతరము.