428
శ్రీకాశీఖండము
ధర్మేశమాహాత్మ్యము
వ. | ధర్మంబు బ్రహ్మహత్యాదిపాపంబుల నపనయింగంజాలుఁ, దారకేశ్వరునకుఁ బశ్చిమభాగంబున నింద్రేశ్వరుండు, దక్షిణభాగంబున శచీశ్వరుండును, నింద్రేశ్వరుం బరివేష్టించి లోకపాలేశ్వరులును, ధర్మేశ్వరునకుం బశ్చిమభాగంబున నూర్వశీశ్వరుండును, ధర్మేశ్వరునకుఁ నాలుగు దిక్కుల దత్తేశ్వర వైరాగ్యేశ్వ జ్ఞానేశ్వ రైశ్వర్యేశ్వరులును నుండ్రు. కదంబశిఖరంబున వింధ్యపాదంబున దమునికొడుకు దుర్దముం డనువాఁడు జరాభారపీడితుండై యొక్క పుణ్యపురుషువలన జ్ఞానోపదేశంబు వడసి కాశికిం జని లింగప్రతిష్ఠ చేసె. ఆదుర్దమేశ్వరుఁడు భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అమిత్రజి త్తనురాజు విష్ణుభక్తిపరాయణుండు నారదునుపదేశంబువలనఁ గంకాలకేతుం డనురాక్షసునిచేత నపహరింపఁబడి పాతాళలోకంబునం జంపకావతి యనుపట్టణంబుననుండి కమలగంధి యనువిద్యాధరకన్యకం బెండ్లియాడి యానందకననంబున కరిగి వీరేశ్వరదివ్యలింగస్థానంబునం దనకంత మనోరథతృతీయావ్రతంబు నోమించి పుత్రవంతుఁ డయ్యె. | 13 |
తే. | మఱి హయగ్రీవంబు మౌనివర్య! | 14 |
వ. | దిలీపతీర్థంబు సప్తమునితీర్ణంబు హంసగోవ్యాఘ్రేశ్వర ముచుకుంద పృథు పరశురామ బలభద్ర దివోదాస హరత్పాపదశా | |