పుట:కాశీఖండము.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

427

సప్తమాశ్వాసము


నంబున వృషభధ్వజలింగంబు, తత్సమీపంబున నర్థనారీశ్వరపీఠంబు, తత్సమీపంబునఁ బంచనదతీర్థంబు, తత్సమీపంబునఁ బంచముద్రమహాపీఠంబు, తత్సమీపంబున వీరేశ్వరలింగంబు, తత్సమీపంబున సిద్ధేశ్వరలింగంబు, తత్సమీపంబున యోగినీపీఠంబు.

8


తే.

కలవు పీఠంబు లానందకాననమున
[1]జెట్టు వ్రేసినచోట దాక్షిణ్యపుణ్య!
యర్థవాదంబు కాదు సత్యంబ కాని
పెద్దపీఠంబు ధర్మేశపీఠకంబు.

9


విశ్వభుజాఖ్యానము

క.

విశ్వభుజాగౌరీపర
మేశ్వరి సేవించి యందు నింద్రాణి సమ
గ్రైశ్వర్యము సౌభాగ్యము
శాశ్వతముగ భర్తసంప్రసాదముఁ గాంచెన్.

10


వ.

విశ్వభుజాదేవి మనోరథతృతీయావ్రతంబున నారాధించి శచీదేవి యింద్రుని, నరుంధతి వసిష్ఠు, ననసూయ యత్రిని, సునీత యుత్తానపాదుని భర్తలం గా వరంబు వడసిరి. ఈవిశ్వభుజాదేవిసమీపంబున నాశావినాయకుండు ప్రణతాఖిలభక్తజనమనోరథసిద్ధిదాయకుం డై యుండు.

11


తే.

వృత్రవధయాదిగాఁ గలవృజినములకు
శాంతి గాఁ కాశికాపురి జంభభేది
ధర్మపీఠంబునకు నుపాంతంబునందు
నిష్ఠతో శంభులింగప్రతిష్ఠ చేసె.

12
  1. ‘జెట్టు వ్రేసినఁ జేటెఁ డక్షీణపుణ్య!’ అని పూర్వముద్రితపుస్తకపాఠము.