పుట:కాశీఖండము.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

379


సిద్ధిత్వంబును దీర్ఘపక్షయుగవిక్షేపప్రభేదంబుచే
నధ్యాహార్యముగా నిరంకుశమహాహంకారధీరోద్ధతిన్.

143


వ.

డాసి యంతంత సాష్టాంగదండప్రణామంబు లాచరించుచుఁ చేరవచ్చి నందికేశ్వరునిచేతికి సందేశపత్రికయిచ్చి తత్సమీపంబున బద్ధాంజలియై యుండె. విదితదివోదాసవృత్తాంతుండై మృత్యుంజయుండు కాశీపట్టణంబునకుం బయనం బగుటయు.

144


ఉ.

ఎత్తిరి టెక్కియంబులును నెల్లులు నంబరవీధి దీటుకో
నొత్తిరి శంఖకాహళము లూఁదిరి శృంగకవంశకాండముల్
మొత్తిరి దుందుభుల్ ప్రమథముఖ్యులు హర్షితచిత్తవృత్తులై
యత్తఱిఁ గాశికానగరయానమహోత్సవజృంభణంబునన్.

145


వ.

అప్పుడు నందికేశ్వరుండు.

146


సీ.

ఏనుఁగు లెనిమిది వృషభంబు లెనిమిది
        తురంగంబు లెనిమిది హరు లెనిమిది
గంగాతరంగిణికాళిందు లీషలు
        సాయంబు రేపును జక్రయుగము
ధవళాతపత్రంబు తారకావర్తంబు
        రజితంపుమొలలు తారాగణంబు
ప్రణవంబు మునుకోల పాదపీఠంబు గా
        యత్రి వేదంబు సర్వాంగరక్ష


తే.

ద్వారసంరక్షకులు దీవ్రధామవిధులు
మార్గదర్శక మామ్నాయమండలంబు
గా సమున్నత మగుశతాంగంబు పన్ని
ప్రాంగణంబున నిల్పె శిలాదసుతుఁడు.

147