పుట:కాశీఖండము.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

శ్రీకాశీఖండము


నుఱక దివోదాసు నుచ్చాటనము చేసి
        యామేలివార్త మంథాద్రి నున్న
హరునకుఁ జెప్పి పంపిరి హరుఁడును వచ్చె
        గాశికానగరికిఁ గరమువేడ్క


తే.

వచ్చి పేరోలగం బుండి వరుసతోడ
యోగినుల భాను విధిఁ బ్రమథోత్కరంబు
హరిని లక్ష్మి వినాయకు నాదరించి
భువనసామ్రాజ్యపట్టంబు పూనె నంటి.

139


వ.

సామాన్యంబున సంక్షేపరూపంబుగా వినుటం జేసి దద్వృత్తాంతశ్రవణంబునందు నాకుం దృప్తి చాలకున్నయది. సవిశేషంబుగా విస్తరించి యానతిమ్ము. కాశీమాహాత్మ్యంబునకుం దక్కినవృత్తాంతంబు లానుషంగికంబులు. ఈ వృత్తాంతం బాధికారికంబు గదా యనుటయు, నత్యంతసంతుష్టాంతరంగుఁడై గాంగేయుండు కుంభసంభవున కిట్లనియె.

140


ఉ.

కైటభదైత్యవైరి యధికం బగునేర్పున మన్నుఱేని కు
చ్చాటన మాచరించి తనచట్టు ఖగేంద్రుని బంచెఁ గ్రమ్మఱన్
హాటకరేఖ దానును గజాస్యుఁడు లక్ష్మియుఁ జేసినట్టి కై
లాటమునం ఘటిల్లె సకలార్థము దేవరయాజ్ఞ పెంపునన్.

141


వ.

అనుచు సంతోషసందేశపద్ధతి లిఖించి గరుత్మంతునిచేతి కిచ్చి పంచిన నతిత్వరితగతి లవణేక్షుసురాసముద్రంబులు దాటి కుశద్వీపంబు డాసి.

142


శా.

తద్ధ్యానాస్పదమానమానసుని మంథక్ష్మాధరాధిత్యకా
మధ్యాధ్యాసితు శంభు డగ్గఱి గరుత్మంతుండు కార్యార్థసం