పుట:కాశీఖండము.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

శ్రీకాశీఖండము


తే.

త్రిపురకాంతలశీలంబు లపహరింప
బుద్ధివేషంబు గైకొన్న పోకులాఁడు
జలజనాభుండు సుగతవేషము ధరించెఁ
గాశికాప్రజలకు ధర్మగతి హరింప.

72


వ.

పుణ్యతీర్థనామంబు వహించి తనమూలభృత్యుం డైనగరుత్మంతునకు వినయకీర్తి యనుపేరు వెట్టి యతని శిష్యుంగా బరిగ్రహించి, లక్ష్మిం బరివ్రాజికం గావించి యమ్మహాదేవికి కౌముది యనునామధేయంబు గల్పించి, తాను శిష్యుండును నొక్కముఖంబున బురుషులం బ్రమోషింపను గమలయొక్కతియు నొక్కముఖంబున బురంధ్రీజనంబులం బ్రలోభింపను సంకేతంబుగా సేసి వేఱువేఱుమార్గంబులం గాశికాపురంబుఁ బ్రవేశించి.

73


విష్ణువు మాయావేషంబున గాశియందు బౌద్ధధర్మంబు స్థాపించుట

తే.

పటమునందు నాగరలిపి ప్రస్ఫుటముగ
వరమషీతూలికాలేఖ వ్రాసినట్టి
యర్హతాగమగ్రంథ మత్యాదరమున
[1]జట్టు పఠియింప బోధించు సద్గురుండు.

74
  1. ఇచట ‘సరసఁ బఠియింప’ అని పూర్వపూర్వతరముద్రితపుస్తకములపాఠము. ఆంధ్రసాహిత్యపరిషత్తులో లభించిన తాళపత్రపుస్తకమునందును మఱికొన్ని వ్రాఁతపుస్తకములందును 'జట్టు' అనియే కనఁబడుచున్నది. ఈపదమె యిచటఁ బొంకముగఁ గుదిరి యున్నది. ఈపదము తప్పను నభిప్రాయమునం గాబోలు ‘సరస’ అని దిద్దిరి. శబ్దరత్నాకరములో ‘జట్టు=జనసమూహము. (ఇది విచార్యము)’ అని వ్రాసియున్నారు. ముద్రితపుస్తకమున నీపదము మార్పఁబడినందునఁ బ్రయోగము లభింపక యట్లు వ్రాసియుందురని తోఁచుచున్నది.