పుట:కాశీఖండము.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

శ్రీకాశీఖండము


బేతాళకూశ్మాండప్రేతనికరం(రంకం)బులలో నొక్కరుండవు గావలయు, నేము తపస్వులము, శివనామజాపకులము, మంత్రస్థులము, భస్తోద్ధూళనవర్మధారులము, మాలికారక్షావజ్రపంజరమధ్యస్థితులము, మముఁబోంట్ల నీకు వెఱపింపంబనిలేదు; చేర రాకు మల్లంతన యుండు మనినం గృతాంజలి యై యాభూతం బమ్మహీసురున కి ట్లనియె.

42


తే.

ధాత్రి గోదావరీసింధుతటమునందుఁ
బ్రథిత మైనప్రతిష్ఠానపట్టణమున
నగ్రజన్ముండ దుష్టప్రతిగ్రహముల
కారణంబుగ బ్రహరాక్షసుఁడ నైతి.

43


తే.

ఎండ నెండితి మంచున నివము కొంటి
వానఁ దడిసితి మంచున వడఁకుచుంటి
గాలిఁ దూలితి నశనంబు కాననైతి
డప్పిఁ గుందితి డస్సి దట్టంబ నైతి.

44


వ.

ఇవ్విధంబునఁ బెద్దకాలంబు కుతిలపడి యాచారవిరహితుండైన యొక్కపురుషు నాశ్రయించువాఁడనై నిరాధారంబునఁ జరించుచు నొక్కనాఁడు.

45


సీ.

మాటలాడుచు మూత్రమలము లుత్సారించు
        మిహిరోదయమున మేలుకొనఁడు
సంధ్య వార్వఁడు మంత్రజపసంయుతంబుగ
        విడికచ్చతో నుండు విడువ కెపుడు
బ్రహ్మసూత్రము ధరింపఁగ సిగ్గు వహియించుఁ
        జల్దియోగిరము నిచ్చలు భుజించు