పుట:కాశీఖండము.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టాశ్వాసము

343


ఋతువేళలఁ బరిగ్రహింపఁడు నిజభార్య
        నన్యకళత్రంబు నభిలషించు


తే.

నెవ్వఁ డవ్విప్రదాయాదుఁ డేగుదెంచె
మార్గవశమున భాగ్యసామగ్రికలిమి
నాశ్రయించితి నతని మధ్యాహ్నవేళఁ
బ్రాంతదేశంబునం దొక్కరావి నుండి.

46


వ.

అతం డిప్పు డర్థార్జనంబునకు నీక్కాశికాపురికిం జనుదెంచె. పుణ్యక్షేత్రప్రభావంబునం బరాభూతుడనై బహిర్భాగంబునన యున్నవాఁడ. ఇంక నేమి సేయుదు? ఆధారభూతం బైన యతనిం గోలువోయితి. ఎచ్చోటనుండియేనియు నేతెంచి కాశికాపురీరక్షకులు నన్ను బాధపెట్టుదురోయని భీతి యయ్యెడు. నిన్ను శరణంబు వేఁడెద. మహాత్మా! రక్షింపవే! యనినం గృపావశంవదుండై యవ్వాల్మీకి కక్షపాలంబులోని విభూతి హస్తంబున ధరియించి డగ్గరం జని పంచాక్షరీమంత్రంబున నభిమంత్రించి లలాటంబున రణతిలకంబు లిఖించి 'కాశికానగళంబు ప్రవేశింపుము, మద్విభూతిధారణమహిమంబున నీన్ను భైరవాదులు భర్జింపనోడుదురు. కపర్దీశ్వరదేవు దర్శింపుము. అద్దేవుండు నీకు నరిష్టనిరసనంబును, నిష్టావాప్తియుం జేయు' ననిన మహాప్రసాదం బని యతం డట్ల చేసి ముక్తుం డయ్యె. ఇది కపర్దీశ్వరమాహాత్మ్యంబు.

47


క.

అందఱు పారిషదులు నీ
చందంబున శంభులింగసంస్థాపన మా
నందవనీనగరంబున
యం దొనరించిరి యతిప్రయత్నంబులతోన్.

48