పుట:కాశీఖండము.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

333


దానుఁ దల్లియుఁ గాశికాస్థలమునందుఁ
గొలిచి రర్కుల నలువురఁ గుంభజన్మ!

14


వ.

అని చెప్పిన విని యగస్త్యుండు హస్తంబులు మొగిడ్చి పార్వతీహృదయానందవర్ధన! కుమార! యొక్కసందేహంబు నడిగెదం దెలియ నానతిమ్ము. దక్షప్రజాపతిపుత్త్రి కశ్యపప్రజాపతిపరిగ్రహంబు గరుత్మంతునిజనయిత్రి వినత యేమికారణమున దాస్యంబు వహించె నని యడుగుటయు బాహులేయుండు కుంభసంభవున కి ట్లనియె.

15


తే.

సవతి కద్రువ శేషతక్షకులు మొదలు
గాఁగ వేవురు భుజగపుంగవులఁ గాంచె
నండముల మూఁటిఁ గలధౌతగండశైల
సన్నిభంబులఁ గనెఁ బుణ్యసాధ్వి వినత.

16


ఉ.

ఆదిమ మైనయండమునయం దుదయించెను గూబపుల్గు సూ
ర్యోదయవేళ ముజ్జగము నుబ్బరపోవఁగ నయ్యులూక మ
ష్టాదశసంఖ్యదీవులను సర్వవిహంగమకోటికిన్ మహా
హ్లాదము గా వహించెను లలాటమునం దధిరాజపట్టమున్.

17


తే.

ఖగములకు నాదిజం బైనకారణమున
సమ్మతించె విహంగమజాతి మొదలఁ
గౌశికము రాజ్యయోగ్యంబు గా దటంచు
నగియెఁ బిమ్మట దుర్లక్షణములు సూచి.

18


సీ.

భంగించిన ట్లుండుఁ బడఁత మాటికి మాటి
        కూర్ధ్వకంపంబు సేయుటకతాన
జంకించిన ట్లుండు శ్రవణనిష్ఠురముగా
        జెలఁగి ఘూత్కారంబు సేసె నేని