పుట:కాశీఖండము.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

శ్రీకాశీఖండము


బోవు టనుచిత మొప్పదు పోవ కునికి
యేమి సేయుదు పని యాతఁ డిచ్చఁ దలఁకి.

10


వ.

ఎట్టకేలకు శుద్ధాంతగతుం డైయున్నతండ్రిసమీపంబున కరిగి యవ్వేళాగమనాపరాధంబు గారణంబుగా శౌరిచేతం గుష్ఠవ్యాధిబాధితుండు గా శపింపంబడి సాంబుండు.

11


తే.

తండ్రికిని నారదునికి వందనము చేసి
జాంబవతిపట్టి శాపావసాన మెఱిఁగిఁ
గాశికకు నేగి యత్యంతగాఢభక్తి
భాను సేవింప నీవ్యాధి మాను ననిన.

12


వ.

ఇట్లు నారదానుమతిం గృష్ణుచేత శాపమోక్షప్రకారం బెఱింగి సాంబుండు కాశి కరిగి తదుపదిష్టమార్గంబున భాను సేవించి కుష్టవ్యాధిబాధావిముక్తుం డయ్యె. ఇది సాంబాదిత్యమాహాత్మ్యంబు.

13


గరుడాదిత్య మయూఖాదిత్య ఖఖోల్కాదిత్యారుణాదిత్యమాహాత్మ్యము

సీ.

పరమసంయమి కశ్యపప్రజాపతికిని
        వినత కాత్మజుఁ డైనవిహగభర్త
విషధికుక్షినిషాదవితతి భక్షించుచో
        ద్విజుఁ గ్రాసి యుమిసినవిమలబుద్ధి
యిభకచ్ఛపముల రోహిణిశాఖతోఁ దాల్చి
        దివిమీఁదఁ బాఱినపవనవేగి
యహికోటి గెల్చి చి చ్చార్చి చక్రము దూరి
        యమృతంబుఁ గొన్నట్టియమితబలుఁడు


తే.

జిష్ణుపవి కొక్కయీఁక యిచ్చినప్రదాత
యచ్యుతునివాహనము తార్క్ష్యుఁ డగ్రజులును