పుట:కాశీఖండము.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

317


తే.

నతని భూతపిశాచకూశ్మాండగణము
ఢాకినీప్రేతరంకులు శాకినులును
గర్కరీపాదుకావీటికాకరండ
పేటికలు దాల్చి కొల్చిరి భృత్యు లగుచు.

294


వ.

అవ్విధంబున రిపుంజయుండు ప్రజాపాలనంబు పరమధర్మంబుగా శక్తిత్రయచతురుపాయషాడ్గుణ్యంబులు కాలంబెఱిఁగి నడుపుచుఁ బెద్దకాలంబు రాజ్యంబు సేసె. చాతుర్వర్ణ్యంబును జతురాశ్రమంబులుఁ దమతమధర్మంబులు దప్పక వర్తించె. అపుడు వేల్పులు ధరావియోగవేదనాదూయమానమానసు లై మరుద్గురుం బురస్కరించుకొని మంతనం బుండి దివోదాసునకు రాజ్యపదభ్రంశనం బెవ్విధంబునం గావింతు మొకో యని విచారంబునకుం దొడంగిరి. అప్పుడు కార్యంబు నిర్వర్తించి బృహస్పతి యింద్రాదిదేవతల కి ట్లనియె.

295


క.

ప్రాణాపానవ్యానో
దానసమానములు తృప్తి దలకొనఁ జేయం
గా నోపెడు నది యన్నము
ప్రాణం బన నన్న మనఁగఁ బర్యాయంబుల్.

296


తే.

అగ్ని మనలోన నొక్కరుఁ డౌనొ కాఁడొ?
చేయఁడే మారుతము మనచెప్పినట్లు?
వరుణుఁ డెవ్వరివాఁడు? మువ్వురును లేక
యోజితం బగునెబ్భంగి నోగిరంబు?

297


వ.

వరుణానిలాగ్నులు తమతమశక్తు లుపసంహరించిరేనిఁ బిఠరపాకంబు సాగదు. పిఠరపాకంబు సాగక యోదనంబు పరి