పుట:కాశీఖండము.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

309


నౌదార్యశౌర్యధైర్యాదిగుణగరిష్ఠుం గాంచి సబహుమానంబుగా నతని కిట్లనియె.

269


సీ.

మనువంశమకుటమండన! యోరిపుంజయ!
        ధర యేలు లవణాబ్ధి గరుసు గాఁగ
మత్ప్రసాదమున సామర్థ్యం బతీంద్రంబు
        కలకాలమును నీకుఁ గలుగఁగలదు
బర్హిర్ముఖస్నేహపరివృత్తితో దివో
        దాసౌఖ్యవిఖ్యాతిఁ దాల్తు వీవు
వాసుకితనయ విలాసినీరత్న మ
        నంగమోహిని భార్య యగును నీకు


తే.

ననిన నంజలి చేసి మహాప్రసాద
మనుచుఁ బరమేష్ఠియానతి నాదరించి
యిట్టు లని విన్నవించె ధాత్రీశ్వరుండు
పద్మభవునకు గంభీరభాషణముల.

270


ఉ.

నెట్టన నన్ను సత్కరుణ నీరధివేష్టిత యైనధాత్రికిం
బట్టము గట్టెదేని నొక బాస పితామహ! యాత్మ నెగ్గుగాఁ
బట్టక విన్ము భోగులు సుపర్వులు క్రిందట మీఁద నుండఁగాఁ
దొట్టవు సత్యమౌ ధరణి నొక్కరుఁ డున్ననుఁ జేయ రాజ్యమున్.

271


వ.

అనిన నట్ల యగుగాక యని బ్రహ్మ కాశీనగరంబున కేగి విశ్వనాథున కత్తెఱం గెఱింగించి తదనుమతి వడసి దివోదాసునకుం బట్టాభిషేకంబు సేసి సత్యలోకంబునకుం జనియె నయ్యవసరంబున.

272


శా.

చాటించెన్ మనువంశవర్ధనుఁడు విశ్వక్షోణి నందంద ఘం
టాటంకారము దుందుభిధ్వనియుఁ గూడ న్వేగమై దేవతా