పుట:కాశీఖండము.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

శ్రీకాశీఖండము


లంగళ్లయందు మిట్టాడ మానిసి లేక
        గుడియుఁ బాడును జిక్కఁ జెడియె నూళు
లుద్యానములు వాపికోదకంబులు లేక
        వృక్షవాటంబులు వెరలు పోయె
వ్యాఘ్రాదు లైనక్రవ్యాదహింస్రమృగంబు
        లెచ్చోటఁ జూచిన నేఁపు మిగిలె


తే.

సంతతము దాను సృజియించు జంతుకోటి
కఱవుపాల్పడి మోమును కాళ్లు వాఁచి
వండఁగాఁ దిన్న బూరెలవరుస నడఁగ
భ్రమసి దిట దప్పి నివ్వెఱపడియె ధాత.

267


తే.

రాజు లేనికతంబున రాష్ట్రములకు
నన్నిటికి బాధగా ధరిత్ర్యంతరమున
వ్రాలె నఱువదియేఁడు లవగ్రహంబు
కాచె వెలిపుచ్చ నొకభంగి గాక యుండ.

268


వ.

అప్పుడు చింతాక్రాంతుఁ డై జగద్యోని ప్రజాక్షయంబున యజ్ఞాదిక్రియ లుచ్చాటనం బయ్యె, సవనాదిక్రియానాశనంబును నధ్వరభుజులు భూప్రజలఁ బోలె హవిర్భాగాద్యభావంబున బుభుక్షాక్షోభంబు వహించిరి. ఇంక నేమి సేయుదు? ఒక్కనిం బట్టంబుగట్టనినాఁడు సర్వసర్వంసహామండలంబును నాఖండలుండు వర్షింపకుండుటం జేసి యెండి బెండుపడిపోవుచున్నయది. నిఖిలక్షోణీచక్రరక్షణైకదీక్షాధురంధరుం డైన యంతటివాఁ డెక్కడఁ గల్గునొకో? యని యన్వేషించి మనుజవంశంబున రిపుంజయుం డనువాని