చతుర్థాశ్వాసము
231
వ. | అంత నక్కడ శనైశ్చరుండు వారాణసికిం జని లింగస్థాపనంబు చేసె. ఆశనైశ్చరేశ్వరుండు విశ్వేశ్వరదేవునకు దక్షిణభాగంబున శుక్రేశ్వరున కుత్తరంబున సంప్రతిష్ఠితుండై భజియించువారికి భోగమోక్షంబులు ప్రసాదించు. శనైశ్చరునకుఁ దత్ప్రసాదలబ్ధం బీలోకంబు. ఇది శనైశ్చరలోకవృత్తాంతంబు. | 276 |
సప్తర్షిలోకవృత్తాంతము
క. | సప్తమహామునిలోకము | 277 |
వ. | మరీచి యత్రి పులస్త్యుండు పులహుండు క్రతు వంగిరసుండు వసిష్ఠుండు వీరు బ్రహ్మమానసపుత్రులు, సప్తబ్రహ్మలు. వీరికి ధర్మపత్నులు క్రమంబుగ సంభూతి యనసూయ క్షమ ప్రీతి సన్నతి స్మృతి [1]యూర్జ. వీరివలన నా ప్రజాపతులు నానారూపప్రజల సృజియించి బ్రహ్మాదేశంబున నయ్యవిముక్తక్షేత్రంబునఁ దపంబు చేసి మరీచ్యత్రీశ్వరాదిలింగంబులం బ్రతిష్ఠించిరి. సంభూత్యనసూయాదు లగు పతివ్రతలును దమపేర శివలింగంబులం బ్రతిష్ఠ చేసిరి. తత్ప్రసాదలబ్ధం బైన యీలోకంబున సప్తమహామునులును బరమసుఖం బనుభ | |
- ↑ ‘యక్ష’ యని పెక్కుప్రతులఁ గనఁబడుచున్నది. ఇది ‘సంభూతి రనసూయాచ క్షమా ప్రీతి శ్చసన్నతిః, స్మృతిరూర్జాక్రమాదేషాం పత్న్యో లోకస్య మాతరః’ అను మూలమునకు విరుద్ధము.
అరుంధతి యని వేఱొక పా.