పుట:కాశీఖండము.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

229


నూఱడించి త్వష్టృప్రజాపతిభవనంబునకుం బోయి యతనివలన నిజభార్య దపంబు సేయం జనుటయు, నున్న గుఱుతును నెఱింగి యరిగి యగ్రభాగంబున.

270


సీ.

కఠినరింఖాపుటీఘట్టనంబుల భూమి
        పటహనిస్వానంబు ప్రస్తరింప
ధవళలాంగూలపల్లవచాలనంబులు
        గౌముదీచ్ఛాయలఁ గ్రాసి యుమియ
వెలిదామరలఁ బోలు వెడఁదకన్నులయందు
        దారంబు నళులచందము వహింపఁ
బ్రోథసంపుటపరిస్ఫురణావసరముల
        దంతగోరకకాంతి దళుకు సూపఁ


తే.

గొదమగోడిగ యై కురుక్షోణియందు
విపినవీథుల నేకాంతవృత్తిఁ దిరుగు
పరమపుణ్యాంగనాజన ప్రథమగణ్య
సంజ్ఞఁ బొడగాంచె దవ్వులఁ జండకరుఁడు.

271


ఉ.

ఘోటికయై చరించు తనకూరిమిభామినిఁ జూచి క్రమ్మరన్
ఘోటకరూపుఁడై యతఁడు క్రొవ్వెసలారెడుకావరంబుపై
పాటున డాయవచ్చి నిరుపాధికసౌహృదవిభ్రమంబునన్
జీటికి మాటికిం దిశలు చిల్లులు వోవఁగఁ జేసె హేషలన్.

272


తే.

అశ్వరూపుఁ డైన యరవిందబాంధవుఁ
డశ్వ యైన సంజ్ఞ నల్లఁ జేరి
కావరంబుతోడి కందర్పవిక్రియ
మోర మోర మోపి మూరుకొనియె.

273


వ.

ఇవ్విధంబున సాక్షాత్కరించిన తపోలక్ష్మియుం బోలె నబ్బ