పుట:కాశీఖండము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

197


నం గుబేరుం డై యీశ్వరునకు సఖుం డయ్యె. ఆవృత్తాంతంబు వివరించెదము. సావధానమతివై యాకర్ణింపుము.

137


సీ.

పద్మకల్పమునందు బ్రహమానససరో
        జమునఁ బులస్త్యుండు సంభవించె
నాపులస్త్యునకు మహామునిప్రవరుఁ డా
        విర్భావమునఁ బొందె విశ్రవస్సు
విశ్రవస్సునక్కు దపశ్శ్రీసనాథుండు
        వైశ్రవణుండు సముద్భవము నొందె
వైశ్రవణుండు సర్వజ్ఞు నెచ్చెలికాఁడు
        పాలించె లంక యన్ పట్టణంబు


తే.

ఘనయశుఁడు మేఘవాహనకల్పవేళ
యాజ్ఞదత్తి ధనేశ్వరుం డయ్యెఁ బిదపఁ
జిత్ప్రకాశికఁ గాశికఁ జేరవచ్చి
శివుఁ బ్రతిష్ఠించె నవిముక్తసీమయందు.

138


మ.

అవిముక్తంబున యాజ్ఞదత్తి శివు నీహారాద్రిరాట్కన్యకా
ధవునిం దప్పక చూచుచుండె నయుతాబ్దంబుల్ నిమేషక్రియా
వ్యవహారస్పృహ లేనినేత్రములఁ జరాస్థుల్సిరావల్లరీ
నివహంబుల్ పరిశుష్కముల్గనభివర్ణింపంగఁ ద్రైలోక్యమున్.

139


సీ.

గజదైత్యదమనుండు కార్పాసఫలతూల
        వర్తిప్రరోహభావము భజింప
వడఁకుగుబ్బలిరాచవారికూరిమికన్య
        యాలంబనస్తంభయష్టి గాఁగఁ
బరమవిశ్వాసతాత్పర్యనిర్భరభక్తి
        సంపద్విశేషంబు చమురు గాఁగఁ