పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనరంజనము

52


మెఱుపులువోని యొయూరపు
తెఱవలఁ బెక్కండ్ర నిచ్చె దృఢసంప్రీతిన్.

41


వ.

ఇ ట్లొసంగి యక్కూకుదాగ్రేసరుండు చంద్రమతిం
జూచి యిట్లనియె.


సీ.

అనుఁగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు,
                  మిలువేలుపులఁ గొల్వు మేమఱికల,
బతికిముం దనుభవింపకు మేపదార్థంబు,
                  జవదాటకుము నిజేశ్వరునిమాట,
మగఁడు గావించిన మన్నన కుబ్బకు,
                  మదిఁ గృశింపకు మవమానమునకు,
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
                  నాప్తబంధువుల య ట్లాదరింపు,
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిఁ గొలువు మెపుడు
దైవమన్నను, గురువన్న, ధర్మమన్నఁ
బ్రాణనాథుండుసుమ్ము మాయమ్మకాన.

42

హరిశ్చంద్రుఁడు భార్యతో సాకేతంబు చేరుట

వ.

అని వీడ్కొలిపి యయ్యుశీనరభూజాని శిబిరంబెత్తఁ
బడవాళ్లం బంచినం జతురంగబలసమేతుండై హరి
శ్చంద్ర సార్వభౌముండు కతిపయప్రయాణంబులకు