|
మెఱుపులువోని యొయూరపు
తెఱవలఁ బెక్కండ్ర నిచ్చె దృఢసంప్రీతిన్.
| 41
|
వ. |
ఇ ట్లొసంగి యక్కూకుదాగ్రేసరుండు చంద్రమతిం
జూచి యిట్లనియె.
|
|
సీ. |
అనుఁగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు,
మిలువేలుపులఁ గొల్వు మేమఱికల,
బతికిముం దనుభవింపకు మేపదార్థంబు,
జవదాటకుము నిజేశ్వరునిమాట,
మగఁడు గావించిన మన్నన కుబ్బకు,
మదిఁ గృశింపకు మవమానమునకు,
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
నాప్తబంధువుల య ట్లాదరింపు,
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిఁ గొలువు మెపుడు
దైవమన్నను, గురువన్న, ధర్మమన్నఁ
బ్రాణనాథుండుసుమ్ము మాయమ్మకాన.
| 42
|
హరిశ్చంద్రుఁడు భార్యతో సాకేతంబు చేరుట
వ. |
అని వీడ్కొలిపి యయ్యుశీనరభూజాని శిబిరంబెత్తఁ
బడవాళ్లం బంచినం జతురంగబలసమేతుండై హరి
శ్చంద్ర సార్వభౌముండు కతిపయప్రయాణంబులకు
|
|