పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ.క్రీడిమీఁదఁ గవిసి కినుక వశ్వతాదమ
పెనఁగెంగొంతసేపు బెట్టిదముగ
నేచి క్రీడితునెమొ నేనుంగుతొఁగూడ
నవుడు దండధారుడఱేని.
 
సీ. మలయధ్వజుండన నలరారు నెకిమీడు
                                   బలిమి నశ్వత్దామ పయిగవిసి
వేల్పులు పొగడెడు వితమునఁబొరాడి
             రూపుమాసె నతని తూపుగములఁ
గర్ణుండ ద్రుపదుని గట్టి మొనలముట్టి
                 తల్లడిల్లగఁ జేసె నెల్లవారి
దుర్యోధనుడు భీమితోడను ననిఁజేసి
         వెన్నిచ్చిపాఱెను వెఱపు గదిరి

క్రీడ సం శప్తకుల నోర్చి కెలసియార్చి
యెదురుకొన్న యస్వత్దామ యేపుమాపి
వచ్చుచుయుదిస్టరుఁడు చాలబన్నమొంది
కవల గొనియింటికేగినకతనువినియె.

క. విని కర్ణుని మార్కొనఁగాఁ
జనకయొ పక్కకుఁ దొలంగించని వెన్నుంతొ
మనికికిఁ బోయెను మిగులగ
వనినొచ్చిన యన్నసేమ మారయుకొరకున్ .

క. వచ్చినవారిం గనుఁగొని
చచ్చెనుగా కర్ణూండంచు సంతోసముతో
ముచ్చటపడి యడిగినవి
వ్వచ్చుఁడుకలరూపు చెప్పెవనట పెరుఁగఁగన్.