పరమ దైవతము. పురషులకు పత్ని సేవయొక్కటియే శాస్త్రవివాహితమయిన సనాతనధర్మము.
"ఓ కాంతామతల్లులారా! తల్లులారా! న్యాయబుద్ధితో నాలోచింపుఁడు. శస్త్రము న్యాయవిరద్ధముగా నునప్పుడు_"
గంభీదంభీ_ అదిగో శాస్త్రదూషణ వచ్చుచున్నది. ఈ పాపాత్ముడు శాస్త్రతిరస్కారము చేయుచున్నది. శాస్త్రములో నున్న దేదియు న్యాయవిరుద్ధమగాదు. నిత్యమును నూఱుకల్లలాడుమన్నను, వేయిహత్యలు చేయిమన్నను , లక్షదొంగతనము లాచరించుమన్నను, శాస్త్రములోఁ జెప్పియున్నయెడల నివియన్నియు పరమధర్మములగును. ఓతోఁబుట్టువులారా! ఇట్లు కొఱగాని మగపుట్టువు పుట్టిన వ్యర్ధుఁడొకఁడు శాస్త్రనింద చేయుచుండగా చెవుకు పెట్టుకొని వినుచు నూరకున్నాడేమి? మీశాస్త్రాభిమానము చచ్చిపోయినదా? మీరు స్ర్తీజన్మ మేత్తలేదా?
ఒకతె_ఈ పురుషకీటకమును జావఁగొట్టుండి.
ఇంకొకతె_శాస్ర్తదూష్ణముచేసిన వీని నాలుకను కోయండి.
మఱియెకతె _ సిగ్గులేక సభకు నడిచివచ్చిన వీనికాళ్ళను విఱుగఁగొట్టుండి.
వేఱొకతె_ పురుషవిద్యయని కాఱులఱచిన వీనిగొంతు పిసుకండి.
ఈ ప్రకారముగా పలువురు పలు విధములుగా నన్ను దూషించుచు పరిహసించుచు నా మీఁదపడి నాయజమానురాలు వారించు చున్నను నిలువక కొందఱు వీపుమీదను కొందఱు మొగము మీదను చేతులతోను మోచేతులతోను కాళ్లతోను చరచియు పొడిఛియు తనియు నన్ను ప్ర్ర్ర్రాణావశిష్ఠుని జేసి విడిచిరి. రక్షకబటురాండ్రా సందడిలో దండపాణులయి యనభటులవలె నన్ను రక్షింపవచ్చినట్లు నాదాపునకు వచ్చిరి కాని వారిగుఱి యపూర్వమైన దగుట
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/322
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
