పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
`ఆడుమళయాళము

మూరకండుఁడు. ఓయుపన్యాసకా! నీవుపనికిమాలిన మీదేశవర్ణన మునుమాని చెప్పవలసినసంగతి చెప్పు.

" స్త్రీలకు వలేనేపురుషులకును గొన్ని స్వాతంత్ర్యములు గలవు"

"ఒక్తె_ఏనియులేవు.

ఇంకొకతె_ వారికున్న స్వాతంత్ర్యమంతయు స్ర్తీలకు దాస్యము చేయుట.

మఱియుకతె _ పత్నీశుశ్రూషచేయుట.
వేఱొకతె_స్త్రీసేవ చేసుకొనుచు మూలనడిఁగి యుండుట.

"నేనిచ్చటి పురుషులకు స్ర్తీ పరిచర్య ధర్మము కాదనను. శాకపాకములు జిహ్వకింపుగాఁ జేయుటకు సహితము పురుషుఁడు చదువునేర్చి పాక శాస్త్రము నభ్యసింప వలయును గదా?"

"పౌరమహాకామినులు _అక్కఱలేదు. అభ్యాసముచేతనే పాకముచేయు నేర్పుకలుగును. పురుషులకు స్వప్నములోను చదువన్న పేరు చెప్పఁగూడదు.


"అట్లనఁగూడదు. చదువుకొనకపోయినయెడల పురుషులు జ్ఞానహీనులయిన పశుసమానులగుదురుగదా?"


పౌర-- పురుషులు చదువులేనప్పుడే పశువులు. కోతి గొబ్బరికాయవలెవారికి చదువుగూడ నబ్బినపక్షమున, స్వభావదుష్టులయిన పురుషులు పశువులకన్నను తక్కువవారగుదురు. పురుషులకు జ్ఞానముతో పనిలేదు. పురుషులకు సమస్తధర్మములను సమస్తకర్మములను సమస్తపుణ్యములను సమస్త వ్రతములను పత్నీసేవలోనే యిమిడియున్నవి.పత్నులయుచ్ఛిష్ట భోజనమే పురుషులకు మోక్షసాదనము; పత్నుల పాదోదక పానమే పురుషులకు సర్వసుఖదాయకము. పురుషులకు పత్ని యొక్క తెయే