పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

75

మన్మథుఁ డుషానిరుద్ధుల మోహపరవశులఁ జేయుట

వ.

అని తలంచు నయ్యవసరంబున.


చ.

ఉదుటగు చిల్కతేజిపయి నుధ్ధతిమీరఁగ వచ్చి నిల్చి తా
నెదురుగఁ దేఁటినారి మొరయింపుచుఁ బువ్వులవింటి వారలన్
గదసి ప్రసూనవర్షములు గాఢముగా వరుషించె నెంచఁగా
మదనుఁడు బంచబాణుఁ డనుమాట నిజంబగునే తలంపఁగన్.

20


క.

తనయునిమీఁదనే దాడిగ
జనకుండట వచ్చెనన్న సమ్మతి యగునే
యని గలదు బాణుతో నని
తనబలములఁ గూడి వచ్చెఁ దథ్యం బరయన్.

21


చ.

అల విరివింటిరాయలు సహాయత వచ్చిన వచ్చుఁగాని తా
బలువిడి వారిపైఁ గుసుమబాణము లేయుట యేమి యంటివా
యలరఁగఁ దద్వివాహసమయంబున కచ్చుగ వచ్చి పూలచేఁ
జెలువుగ వారికిద్దఱికి సేసలుఁ బెట్టుటయే నిజంబగున్.

22


వ.

ఇవ్విధంబున.


సీ.

పచ్చవిల్తుఁడు వాఁడిబాణంబు లేయఁగా
        నాయుష యిట్లను నాత్మలోనఁ
గలలోనఁ గలయు నీకందర్పతనయునిఁ
        దోడితెమ్మని చాల వేఁడుకొనఁగ
ద్వారకాపురిఁ జేరి తరలాక్షి నామీఁది
        నెనరున నిటు దెచ్చె నేర్చు మెఱసి
యేమిసేయుదు నీతఁ డింతి రమ్మని పిల్చి
        గారవించడు మదికాఁకదీరఁ