పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

159


గీ.

పొక్కిలందునైన భుజమధ్యమునైనఁ
గేలుదమ్మినైన మౌళినైనఁ
గంఠసీమనై నఁ గఱగంఠు ధరియింపఁ
దగు నృపాల! నాభిదిగువఁ దక్క.

160


క.

నావుడుఁ దద్గురుమణితో
భూవిభుఁ డిట్లనియె భోగిభూషణ యమృత
ఫ్లావిత యగునీవచన
శ్రీ వీనులఁబొరసెఁ గంటిఁ జిరసౌఖ్యంబుల్.

161


గీ.

భక్తులగువారియెడఁ గల్పపాదపంబు
పొడవుగనియున్న ని న్నొత్తియడుగ వెఱవ
భసితరుద్రాక్షధారణప్రాప్తమైన
పుణ్య మెయ్యది వివరించి ప్రోవు మనుడు.

162


క.

సర్వావస్థలయందును
సర్వేశుని లింగమూర్తి సౌభాగ్యకళా
నిర్వాహకు ధరియించిన
సర్వజ్ఞుల కిందు నందు సౌఖ్యము దొరకున్.

163


సీ.

హరకంఠముఖులు సంయములును మనువులు
        నెలకొల్పి రీశానుగళమునందు
బ్రహ్మవిష్ణుసురేశపావకాదులు దాల్చి
        రుత్తమాంగంబుల నూర్ధ్వరేతు
నక్షపాద-శిలాద-హరదత్తముఖ్యులు
        వహించిరి నుదుళ్ళ వామదేవు
శక్తులు నందికేశప్రభృత్యాత్మవే
        దులు పూని రురముల నలికనయను