పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఉద్భటారాధ్యచరిత్రము


గీ.

తోను బెరుఁగును నెయ్యిని దేనియయును
బంచదారయఁ గ్రమమునఁ బాదుకొల్పి
హెచ్చి యష్టాంగధూపంబు లిచ్చి శంఖ
కాహళాదికముల మ్రోఁతగడలుకొనఁగ.

156


వ.

స్వస్తికవిస్తృతంబగు కూర్మాసనంబు నిర్మించి ప్రాణప్రతిష్ఠాగరిష్టంబులగు మంత్రంబులు తంత్రపూర్వకముగా నుపన్యసించుచు శంఖముద్రాముద్రితకరాంబుజుండై తచ్ఛిష్యు నుద్దేశించి “ఆవయో స్సిద్ధిర” స్త్వనుచుఁ దన్మస్తంబు హస్తంబునం గుస్తరింపుచు “నయమ్మే హస్తో భగవా” నను వేదమంత్రంబుతోడ నీరంధ్రతేజోవిరాజితంబును అశేషపాశత్రుటనాకర్తృణిమూర్తియును, విజ్ఞానప్రజ్ఞాప్రదర్శనదీపాంకురంబును, గంధపుష్పాద్యుపచారపూజితంబును హృద్యనైవేద్యప్రహృష్టంబునగు జ్యోతిర్లింగంబును “నకదాచిద్వియోజయే” త్తనుచుఁ బుష్పాంజలిపూర్వకంబుగా వినయైకధురీణుండగు నతనికి నగ్గురుండు ప్రాణలింగంబు చేయవలయు నిది లింగధారణప్రకారంబు.

157


క.

అన విని హర్షాశ్రులు కనుఁ
గొనలం దళుకొత్త రాజు గురురాజునకున్
బునరభివాదనములు ధృతి
నొనరిచి యిట్లనియె వినయయుతమానసుఁడై!

158


చ.

తెలిపితి లింగధారణవిధిన్ గురువల్లభ! గుర్వనుజ్ఞకున్
దొలఁగక శిష్యుఁ డెల్లపుడు ధూర్జటిలింగము నెట్టిఠావులన్
నెలకొనఁ జేయఁగావలయు నీమది న న్గరుణించి యాదరం
బొలయఁగఁ జెప్పవే యనుడు నుద్భటుఁడుని నృపుఁ బల్కు నీక్రియన్.

159