లనుగతివిశేషంబుల రా నమందానందంబున రైవతకసమీపంబునకు వచ్చుటయు
హరిరాక యెఱింగి బలభద్రసాత్యకిప్రముఖసోదరులు ప్రద్యుమ్నసాంబానిరుద్ధాది
పుత్త్రపౌత్త్రవర్గంబును యదువృష్ణిభోజాంధకానీకంబునుం జతురంగబలసమేది
తంబుగా నెదుర్కొనుటయుం బరస్పరవాహనావతరణంబులు చేయునెడం గృష్ణుండు
బలభద్రునకు నమస్కరించి గాఢాలింగనమ్ముఁ జేసి తనకు మ్రొక్కిన సాత్యకి
ప్రద్యుమ్నసాంబానిరుద్దారుల దీవించి యదువృష్ణిభోజాంధకవర్గంబులం దగు
తెఱంగుల నాచరించి బలభద్రాదులు నిజవాహనంబు లెక్కం దానును గరుడాధిరో
హణంబు చేసి వందిమాగధసందోహస్తుతిరవంబులును వేణువీణాగానంబులును
భేరీమృదంగాదినిస్వనంబులును రోదోంతరాళంబు నిండ నిండువేడుకతోఁ బుర
ప్రవేశంబు చేయునెడం జంద్రశాలికల బాలికలు సేసలు చల్లం జామరానిలంబులు
మార్గశ్రాంతి నపనయింప రాజమార్గంబు దఱిసి నిజమందిరతోరణంబున సుపర్ణావత
రణంబు చేసి సకలజనంబుల నిజనివాసంబులకు ననిచి సత్యాసహితంబుగా నంతః
పురంబునకుం జని సముచితవ్యాపారంబుల సుఖం బుండె ననుటయు విని యభిమన్యు
పౌత్త్రుండు సంతోషపులకితగాత్రుండై మునీంద్రా తరువాతివృత్తాంతం బెఱింగింపు
మనుటయు.