పుట:ఉత్తరహరివంశము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

233


బకట వినాశ మందఁ దగునయ్య తగం బ్రతిపాలనంబుచే
వికలముగాక యుండ యదువీరవరాగ్రణి కావు నావుడున్.

112


శా.

సంతోషించి మురాంతకుండు విడువన్ శంభుజ్వరం బప్పు డా
పంతం బప్రతిగణ్యరూప మగుచుం బాదప్రణామక్రియా
త్యంతం బయినసపర్య శ్రీవిభునిఁగా నాత్మం దలం పొందఁగా
శాంతిం బొంది నుతిప్రకారవిలసత్సాంద్రోక్తిసంభావనన్.

113


వ.

ఇట్లు స్తుతియించె.

114


శా.

“కృష్ణాంగాయ నమో నమో మురభిదే కేశి ప్రహర్త్రే నమో
నిష్ణాతాయ నమో నమో బలిజితే [1]నిస్వాపభర్త్రే నమః
కృశ్ణేష్టాయ నమో నమో మధుభిదే క్లేశానుశాస్త్రే నమో
ధృష్ణోక్త్రాయ నమో" యనంగ శుభముల్ దీపించు మా కెప్పుడున్.

115


మత్తకోకిల.

ఈశ్వరాయ మహాత్మనే దనుజేశపంక వివస్వతే
శాశ్వతాయ ధరాధృతేంబుజచక్రశార్ఙ్గగదాధరా
యాశ్వమేధఫలైకసంస్తుతిహారివాఙ్మునిరక్షిణే
విశ్వరక్షణహేతవే ప్రభవిష్ణవే౽స్తు నమో యనున్.

116


మ.

సురమర్త్యోరగవిష్టపత్రితయసంక్షోభంబు గావించుచున్
విరసాధిక్యవిశేషపోషణమిళద్వీరప్రలాపంబులన్
సరి లే రంచుఁ జెలంగు దైత్యవిభునిన్ స్తంభంబులోఁ బుట్టి శ్రీ
నరసింహాకృతితో వధించిన నిను న్సంభావనన్ మ్రొక్కెదన్.

117


సీ.

తాటకాజీవనస్థైర్యంబు శరభాను
                 సంచయప్రభలకుఁ జవులు చూపి
ఖరదూషణానీకవరపత్త్రనివహంబు
                 నాశుగపఙ్క్తిఁ జీకాకు పఱచి
రాజత్తరకబంధరాక్షసు జంఘాల
                 పత్త్రిసంఘంబుల పాలు చేసి

  1. నిష్పాపపాత్రే