పుట:ఉత్తరహరివంశము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ఉత్తరహరివంశము


మురవైరినీడన మూఁడులోకంబులు
                 బ్రదుకంగ మన కేల పలవరింప
నద్దేవుమనుమని నద్దిరా యెటు చూతు
                 ననక [1]కేరడ మెవ్వఁ డలవరించె


తే.

వెఱవ కోడక యొకరుండు వ్రేలఁ జూప
నెంతవాఁ డక్కుమారు నోరంతప్రొద్దు
గలసి పాసి పోఁజాలనికతన మనకు
నేలతలఁ గాళ్లు నిలువమి నిజము గాక.

280


ఆ.

అనుచు నుండలేక యార్తస్వరంబున
నేడ్చి రంతిపురము నింతు లెల్ల
బురజనంబులెల్ల గురరీనినాదమో
యంగనారవంబొ యని తలంప.

281


వ.

అట్టియెడ వీరభటులు గడురయంబునం జనుదెంచి యెక్క డెక్కడ యను
వారును నే మేమి యనువారును నెవ్వ రెవ్వ రనువారును నిలు నిలు మనువారును
బోకు పో కనువారును నగుచుఁ గళవళించి యక్కామినులచే ననిరుద్ధుం డూరక
యదృశ్యుం డయ్యె నని యెఱింగి విస్మయంబున.

282


గీ.

హలధరుండును హరియు సాత్యకియు మఱియుఁ
బేరు గల దొరలందఱు బెరసి సభకు
నరిగిరి పురంబులో వీరు అంతపట్టు
నెఱుఁగ సన్నాహభేరి వేయించి పిదప.

283


క.

ఇత్తెఱఁగున సభలోపల
దత్తఱమునఁ గూడఁబడిన దర్పితసామం
తోత్తములలోన విపదుఁడు
మత్తద్విపలీల మనసు మండ నిటు లనున్.

284


చ.

ఒకఁ డనిరుద్ధుఁ బాపుటకు నుల్లములో వగ లేదు నాదు సై
నికులఁ దలంప కిందు రజనీసమయంబునఁ జొచ్చి యెవ్వఁడో

  1. కోఱడ మె