పుట:ఉత్తరహరివంశము.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

161


ధర నవతరించె లక్ష్మీ
శ్వరుఁడు జగన్నాథుఁ డపుడు వార్ష్ణేయుండై.

295


వ.

ఆదేవుఁడు గలుగుటంజేసి కౌంతేయురాజసూయంబు నిర్వహించే నట్లు యమున
మడువునం బడినహంసుఁడు పొడవడంగుట సకలగంధర్వులు హరినామసంకీర్తనంబున
గీతంబు లొనర్చిరి తత్సమయంబున.

296


క.

హలధరునితోడ డిభకుఁడు
దలపడి పెనఁగునెడ సూర్యతనయాసలిలం
బుల మునిగి హంసు డిలిగెం
దలఁకున నని పలుకు వినియెఁ దత్రత్యులచేన్.

297


మ.

 విని వేగంబునం బాఱుతెంచి యమునావేగంబునం బాకశా
సనశస్త్రప్రహతిం బయోధిఁ బడు నా శైలంబుచందంబునన్
మునిఁగెన్ వెంట హలాయుధుండు దఱమన్ మోహాంధకారంబులో
మునిఁగెం దజ్జల మెల్లఁ దల్లడపడ న్ముప్పెట్టు వెట్టెన్ వడిన్.

298


వ.

ఇట్లు డిభకుఁడు యమునాజలంబుల మునింగిన హంసుం గానక యిట్లని
విలాపించు.

299


సీ.

నాయెల్లినీడన నరలోక మేలుదు
                 ననులావు వఱితిపా లయ్యె నన్న!
దేవేంద్రునకు నైనఁ దేఱిచూడఁగరాని
                 గౌరవోన్నతి నీటఁ గలసె నన్న!
పార్వతీపతిచేతఁ బడిసినదివ్యాస్త్ర
                 భూరిసంపద వెల్లిఁ బోయె నన్న!
వలరాజునకు నైన వర్ణింపఁ గాఁ దగు
                 తనువిలాసం బేఱు గొనియె నన్న!


తే.

యన్న! నీయట్టియన్న న న్ననుదినంబు
గారవింపఁగ నుండ నే కరుదుఁ నన్న
నింకఁ జాల నెవ్వగలచే నిచట నిలువ
నాకు నేల నీ[1]తోడిదే లోక మన్న!

300
  1. లోక మగుదు నన్న