పుట:ఆముక్తమాల్యద.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నారాధించిన నతండు సన్నిహితుండై 'మా ము పా స్వ' యనుటయు; ముందు
గర్భమునందుండియు నఖండితతపస్తులితవామదేవుం డగు వామదేవుండు
'సూర్యో౽హం మనురహం కక్షీవానహ'మ్మని శరీరవాచకశబ్దంబు శరీరపర్యం
తంబు పోవుటంజేసి చిదచిచ్చరీరకుం డగు నప్పరమాత్ముంగూర్చి యను
సంధించెననియుఁ దెలిపి; చేతనుండైన తా జగత్కారణంబు గామి విబుధులం
దెల్ల విజ్ఞానవృద్ధుం డగు నా వృద్ధశ్రవుండు తదనుసంధానన్యాయంబున
నుపదేశించె నని శ్రుతిస్తూత్రముఖంబుల నిగమాంతశాస్త్రఫక్కికఁ జాల
వక్కాణింపంపడు; నాత్మయు నవనియు ననల పవన గగన కాల మృత్యు
ప్రభృ త్యఖిలచిదచిత్ప్రపంచంబు లతనిశరీరంబు లనియు నందె వినబడు;
నట్లగుట నశేషదివిషచ్ఛరీరంబు లన్నారాయణశరీరంబులే కదా, యని
ముముక్షువున కప్పుండరీకాక్షుఁదక్క నేవ్యక్తి నైన నుపాసింపవచ్చునే?
విష్ణునకుఁ దత్తత్కాలవిగ్రహంబు లగుటం బ్రహ్మ రుద్రార్జున వ్యాస
భాను భార్గవాది భజనంబు త్రైవర్గికునకుం గాక యపవర్గకాంక్షుల
కయుక్తం బని స్మృతి చెప్పు; నదియునుంగాక, యీశ్వరునకుఁ జేతనునకు
నిత్యసంబంధంబు 'మాతా పితా భ్రాతా నివాస శ్శరణం సహృ ద్గతి ర్పారా
యణ", యని సమస్తంబునకుఁ బఠాయణంబుగా, నతనిం ప్రతిపాదించు
శ్రుత్యంతరంబు గల; దట్టి పరమేశ్వరుం గనుటకుం దగిన యోగంబుఁ
జెప్పెద; ఖాండిక్య కేశిధ్వజ సంవాదంబు విను మని యిట్లనియె.

13

ఖాండిక్య కేశిధ్వజ సంవాదము

మ.

జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షుఁ గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశిధ్వజున్.

14


క.

వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.

15


చ.

పలవల వేగ నిచ్చలును బౌఁజులు దీర్చి యతండు నాతఁడున్
వెలువడి వచ్చి, యిక్షుమతివేణిక యేపిరిగాఁగ నీఁగుచున్