పుట:ఆముక్తమాల్యద.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనిన నాతండ్రియాయెనే యనియె నే మె
ఱుంగమే యార్తిఁగడువు చల్లంగఁ బలికి
కరుణచేసితి విజయివి గమ్మటంచు
బాష్పజల మాఁగి యింటికి, బరువు వాఱి.

50


ఆ.

మ్రొక్కినట్టి తనయ మూర్ధంబు మూర్కొని
ప్రమదభాష్ప మురుల బ్రాహ్మణుండు
చేత వెన్ను నిమిరి నాతల్లి నినుఁ గంటిఁ
గా యటంచు నింటి కడ వసింప.

51


తే.

రంగపతి బ్రహ్మ రుద్రుల బ్రాహ్మి గౌరిఁ
దనకుఁ నక్కన్య నడిగింపఁ బనుపుటయును
వారు సేనేశసహితులై వచ్చుటయును
విష్ణుచిత్తుఁడు సంభ్రమాన్వీతుఁ డగుచు.

52


వ.

విష్వక్సేనపూర్వకంబుఁగా వినయంబున నాతిథ్యం బొసంగి యుచితాసనం
బుల నాసీనులై యున్నవారి యాగమనప్రయోజనం బడిగి తెలిసి ప్రమదరస
భరితాంతరంగుండై యిట్లనియె.

53

గోదాదేవి శ్రీరంగనాథుల వివాహము

క.

ధన్యుఁడ నైతిం దన కీ
కన్యక నీఁగాంచి భృగువు గౌరవముఁ బయో
ధిన్యాయము నొదవె నిటే
నన్యాయంబే? చమూప హర విధులారా.

54


క.

వినుఁ డీఁ దగు సంబంధవు
టెనయికఁ గని మోచి తెచ్చి యిచ్చె ననరె చు
ల్కని నరులు; గాన మాపుర
మునకు న్విజయంబు చేయఁ బుత్త్రిక నిత్తున్.

55


తే.

ప్రభుతఁ బరమేశ్వరుం డైనఁ బత్ప్రపన్న
జనమున కొసంగు మీకు నీ చనవు శౌరి