పుట:ఆముక్తమాల్యద.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దునిసి బైటికి నసిధార దోఁచె ననఁగఁ
కనకరుచి మధ్యలత నారు కాంత కలరు.

24


క.

అండజగామిని యూరుపుఁ
బిండువలపు లాన నాభిబిలము వెడలి చ
న్గొండల నడుముగఁ బ్రాకెఁడు
కుండలియో యనఁగ నారు కొమరొప్పారున్.

25


క.

అంగన నిలిచిన బాహువు
లుం గౌనును నేఱుపఱుచు లోకమునకు ర
త్నాంగద కాంచీభేదము
లుం గెళవుల నడుమ నునికియు న్నూఁగారున్.

26


క.

తనుమధ్య వళీభంగము
లనుగూర్పఁగ నవియుఁ దత్కులముల యగుటఁ గం
తుని యిడినపత్తిఱే కనఁ
జను నొడ్డాణమునఁ గౌను చామకు నమరున్.

27


క.

లేఁ గౌఁ దీఁగ నితంబము
వ్రేగునఁ ద్రెంపుటయుఁ గని విరించి బిగింపన్
లోఁగి ముడి యిడియె వదలుగ
నాఁ గోకస్తని గభీర నాభి చెలంగున్.

28


క.

వెలఁది కటిపేర నిల నొక
పులినము డిగఁబడియె సింధు పులినపు పంక్తిన్
నలువ యది వడఁగఁగాదే
తెలియుట కం దంచపదము దిరముగ నిలిపెన్.

29


తే.

కదళి దివియించె నాగ్రాంఘ్రికంబు తొడల
పెనుపు నె ట్లన్నఁ బొరల సోదన నడంచు
కొన్న యాఁదోఁకపాటును గొప్పు విప్ప
మెఱయు గోర్మ్రుచ్చులును గెంపు గుఱులు గావె.

30


తే.

వసుధలో నెట్టి శ్రీ గల వారివేని
కరభములు దాస్యములు సేయు సరసిజాక్షి