పుట:ఆముక్తమాల్యద.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై
                   నట్టి త్రాఁ చొక్కటి చుట్టియుండు
రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది
                   పొలయ దందేడాఱు నెలలు గాని
యేపాటి బలియైనఁ జేపడుఁ బ్రాణిహిం
                   సాది పూజనముల కాసపడదు
తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య
                   మై యుండు నయ్యు నింతంత గాదు


తే.

రత్నమొక్కటి పై ననర్ఘంబు మెఱయు
గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి
కక్షయ మనంత మాద్య మేకాంతమందు
భూప! నీకొక్కనికె కాక చూపరాదు.

200


వ.

అని విన్నవించిన సంతసించి, సేనాసమేతుండై యతండు మున్నుగా శ్రీరం
గంబున కరిగి కావేరీచంద్రపుష్కరిణులఁ దీర్థం బాడి రంగనాథుని సేవించి
సాభిప్రాయంబుగా నతనిం గటాక్షించిన నతం డిట్లనియె.

201


క.

"మీ పెద్దలు గూర్చిన ని
క్షేప మ్మిది గొ"మ్మంచు శ్రీరంగపతి
శ్రీపదయుగ్మముఁ జూపిన
నాపృథ్వీపతియు హఠనిరస్తభ్రముఁడై.

202


వ.

గ్రక్కునఁ దనపూర్వదశఁ తలంచి యిన్నాళ్ళు దనప్రమాదంబునకుఁ బరమ
నిర్వేదన నొంది 'నీ వెవ్వండ ?' వనుటయు, 'నే మీ పితామహుం డగు నాథ
ముని ప్రశిష్యుండ; నయ్యోగివరుండు భావి భవజ్జన్మం బెఱింగి భాగవతవతం
సంబ వగునీచేత నివ్విశిష్టాద్వైతంబు సకలభూతహితంబుగా వెలయంగలయది
యని నిశ్చయించి, నీకు ద్వయం బుపదేశింపు మని, తన శిష్యుఁడగు పుండరీ
కాక్షున కుపదేశించిన, నతండు భోగాసక్తుండ వైన ని న్నుపాయంబున దెలిపి,
నీ కుపదేశింపు మనుటయుఁ, బనివింటి,' ననిన, సాష్టాంగంబుగాఁ బ్రణ
మిల్లి, యతనిచేతఁ బంచసంస్కారసంస్కృతుండై, యంత నిలువక తురీ
యాశ్రమంబునకు రాఁగలవాఁడై స్కంధావారంబునకు మగిడి వచ్చి, కుమారునందు