పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దమ్ముగాఁ బ్రచలద్బృహజ్జలధార లొప్పఁగ వృష్టిఁ జే
నె మ్మహానదులున్ మహాసరసీచయమ్ములు నిండఁగాన్.

43
భారతము, ఆదిపర్వమున
లయగ్రాహి.

కమ్మనిలతాంతములకు మ్మొనసి వచ్చు మధుపమ్ము...

44


అని వున్నది గనుక జాడ తెలుసుకోగలది.

అర్ధబిందుప్రాసము

అనంతచ్ఛందంబున (1.52)
గీ.

సార్ధ బిందువులై తేలినట్టిటపల, కరయఁ బ్రాసంబు నిర్బిందువైనఁ జెల్లు
వీఁపు మూఁపును మఱి తలమోపు నయ్యె, మాట లేటికి మేటి తాఁబేటి కనిన.

45
నన్నయభట్టు లక్షణసారంబున
గీ.

ఒకటి కరసున్న గలిగి మూఁటి కవి లేక
ప్ర్రాసములు లఘుపదము లై పైనిజెల్లుఁ
గృతుల నొక్కొక్కచో నది యెట్టులనిన
నిఁకను నెఱిఁగింతుఁ జెప్పుడీ సుకవు లనఁగ.

46


తా.

కచటకప వర్గాక్షరములలో అరసున్న గలయక్షరములు మూఁడు, సున్న లేనియక్షర మొకటిగాని, సున్న లేనియక్షరములు మూఁడు, అరసున్న గలయక్షర మొకటిగాని వున్నట్టయితే ప్ర్రాసము చెల్లును.

లక్ష్యము
గీ.

వీఁక నానందరంగమహీకళత్రుఁ, డాటల విధంబు రిపులను వేఁటలాడి
దాపురం బైనవైరంబు వాపుకొనియెఁ, జూచినవజీరు లొగిఁ దలలూఁచగాను.

47
మఱియు, భారతము, విరాటపర్వమున (2-271)
క.

నాకొఱఁతఁ దీర్చి వచ్చితి, నీకొఱఁతయె యింక సూతునిం దెగఁజూడన్
లోకము వంచింపం దగుఁ, జీఁకటిరేయొదవ నేమిచేయుదొ చెపుమా.

48
మఱిన్ని, భారతము, ఆదిపర్వమున (2-42)
క.

ఆపన్నగముఖ్యులఁ దనవీఁపునఁ బెట్టుకొని పఱచి విపినములు మహా
ద్వీపంబులు గిరు లలఘుది, శాపాలపురములు చూపెఁ జని వారలకున్.

49
భారతము, ఉద్యోగపర్వమున, (4-407)
క.

మేటు లగురథికులను నొక, నాఁటికి వేవుర వధింతు వరుశరములునో
నాటి పడవైచునంతకు, వేఁటాడెదఁ బ్రతిబలంబువీరుల నెల్లన్.

50