పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇందుకు లక్ష్యము, సాహిత్యరత్నాకరమున

“అద్యగ్నిరుద్ర గ్రహనేత్ర వేదరనిర్దిశర్తుర్వసుషోడ శాశ్చ,
మన్వంతరౌ బాణతురంగవాసరాస్త్రయోదశస్యుః పదవర్ణమాహుః.”

265
లక్షణదీపిక
మ.

మొదటన్ మూఁడిట రుద్రులన్ నిధికరాంభోరాసులన్ బంగజా
ప్తదిశారిద్విపరాణ్మనుప్రభృతులన్ బాణాద్రిఘస్రంబులన్
బదుమూఁటన్ గవి యేఁబదక్షరము లొప్పన్ వ్రాసి తా వ్రాసిన
ట్లది భావింపఁగ సిద్ధసాధ్యకసుసిద్ధారుల్ తగన్ శ్రీహరీ!

266


సీ.

చదురమై పదియాఱుచౌకపుటిండుల యదియె షోడశచక్ర మందులోన
మొదలింట మూఁటను బదునొకంటను దొమ్మిదింట రెంటను నాలుగింటఁ బదియు
రెంటఁ బదింట నాఱింట నెనిమిదింట నలిఁ బదాఱిటఁ బదునాలుగింట
నేనవతావున నేడింటను బదియేనింటను బదుమూఁట నెనసి వెలయు


తే.

నక్షరంబులు గృహముల నైదుపదులు, నిలిపి పతికోష్ఠమున నుండి వలయముగను
సిద్ధసాధ్యసుసిద్ధారిచింతనంబు, వెలయఁ గావించి రిపులిపు ల్విడువవలయు.

267


వ.

అని కవిగజాంకుశమున నున్నదిగనుక నీషోడశ చక్ర మీక్రమంబున విమర్శించు
కొనునది.

268