| వెలఁగి పొగడఁ గవిత చెప్పెడువారు స | 261 |
వ. | అని యున్నది. | 262 |
సీ. | వినుత పద్యాది నిల్పినవర్ణమునకు నాథునివర్ణమున కరి తొడరకుండ | |
తే. | [1]గణగణజయామములు తత్త్వగతులు రసము | 263 |
మిత్రారిషోడశచక్రము
క. | విధుపురహరనిధిదృగ్వన, నిధిరవిదిక్ఛా స్త్రదంతినృపమనుశరభూ | 264 |
తా. | చౌకముగాఁ బదునాఱిండ్లు వ్రాసికొని అందు నకారాది యేబదియక్షరములు — విధు=1, పుర=3, హర=11, నిధి=9, దృక్=2, వననిధి=4, రవి=12, దిక్ =10, శాస్త్ర=6, దంతి=8, నృప=16, మను=14, శర=5, భూమిధర=7, దివస=15, త్రయోదశ=13, యీలెక్కమేరకు వరుసగా నకారముమొద లేఁబదియక్షరములు వ్రాసినట్టయిన నది సిద్ధము, సాధ్యము, సుసిద్ధము, అరి అని నాలుగుచక్రములై చక్ర మొక్కటికి నాల్గేసియిం డ్లేర్పడును. అందు మొదటిచక్రము నాల్గిండ్లకు సిద్ధసిద్ధము, సిద్ధసాధ్యము, సిద్ధసుసిద్ధము, సిద్ధారి అనిపేరులు. రెండవచక్రము నాల్గిండ్లకు సాధ్యసిద్ధము, సాధ్యసాధ్యము, సాధ్యసుసిద్ధము, సాధ్యారి అనిపేరులు. మూడవచక్రము నాల్గిండ్లకు సుసిద్ధసిద్ధము, సుసిద్ధసాధ్యము, సుసిద్ధసుసిద్ధము, సుసిద్ధారి అనిపేరులు, నాల్గవచక్రము నాల్గిండ్లకు అరిసిద్ధము, అరిసాధ్యము, అరిసుసిద్దము, అర్యరి అనుపేర్లు. కానఁ గృతినాయకునిపేరుయొక్క మొదటియక్షరము ప్రబంధపు మొదటియక్షరము అరి యనుచక్రపుటిండ్లలో నుండక యుండవలెను. ఉండినఁ గారాదు. | |
- ↑ గణజనన