పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

ప్రవేశిక

భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లొ ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానాన్ని ఆక్రమించింది దీని వైశాల్యం 2,75,909 చ. కి. మీ. దాదాపు 54 మిలియన్ల (1981) జనాభాను కల్గివుంది. వైశాల్యంలోను, జనాభాలోను ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలుగ తూర్పున బంగాళా ఖాతము, ఉత్తరాన ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. 960 కి. మీ సుదీర్ఘమైన తీరప్రాంతాన్ని కల్గి ఉంది. దేశంలో పెద్ద నౌకా కేంద్రాల్లో ఒకటైన విశాఖపట్నం నౌకా కేంద్రం ఈ రాష్ట్రంలోనే ఉంది. భారత నౌకాదళపు తూర్పు విభాగపు కేంద్రంగాను, దేశంలో ఏకైక జలాంతర్గాముల స్థావరంగాను విశాఖపట్నం ప్రసిద్ధి చెందింది.

ఇరవై మూడు జిల్లాలు [1] గల ఆంధ్రరాష్ట్రం భౌగోళికంగా మూడు విభాగాలుగా వ్యవహరించబడుతోంది అవి 1 సర్కారు ప్రాంతం లేక తీరాంధ్ర ప్రాంతం, 2 రాయలసీమ, 3 తెలంగాణాలు. సర్కారు, రాయలసీమ ప్రాంతాలు మొదట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేవి. తర్వాత 1953 అక్టోబరు 1 వ

  1. (1) 23 జిల్లాలు 1 శ్రీకాకుళం 2. విజయనగరం 3. విశాఖపట్టణం 4. తూర్పు గోదావరి 5. పశ్చిమ గోదావరి 6. కృష్ణా 7. గుంటూరు 8. ప్రకాశం 9. నెల్లూరు 10. చిత్తూరు 11. అనంతపురం 12. కడప 13. కర్నూలు 14. మహబూబ్‌నగర్ (పాలమూర్) 15. మెదక్ (మెతుకు) 16. నిజామాబాద్ (ఇందూరు) 17. కరీంనగర్ (ఎల్లందల) 18. అదిలాబాద్ (ఎదులాపురం) 19. వరంగల్ (ఓరుగల్లు) 20. నల్గొండ 21. ఖమ్మం 22. హైదరాబాద్ (భాగ్యనగరం) 23. రంగారెడ్డి.