పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞాపనలు సమర్పించడం జరిగింది. ఇందుకుగాను భారతప్రభుత్వం రూ. 700 కోట్లు తక్షణ సహాయాన్ని అందిస్తూ, తక్కిన సహాయాన్ని విపత్తు వల్ల కల్గిన నష్టాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అందిస్తామని తెలియజేసింది.

159. 2012 లో సంభవించిన దుర్భిక్షపరిస్థితులకు గాను, నీలం సైక్లోన్ వల్ల సంభవించిన విపత్తుకు గాను రూ. 1,464 కోట్ల మేరకు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీ 2013-14 లో విడుదల చేయడం జరిగింది. విపత్తుల వల్ల నష్టపడ్డ రైతులకు ఈ సబ్సిడీ నేరుగా అందడం కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేపట్టబడ్డాయి.

160. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.403 కోట్లు ప్రతిపాదించడమైనది.

శాంతిభద్రతలు

161. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు వివిధ సంస్థలకు నిర్వహించవలసి వచ్చిన ఎన్నికలను శాంతిభద్రతలకు విఘాతం లేకుండా నిర్వహించడం, ఫైలిన్, హెలెన్, లెహెర్ సైక్లోన్ల సందర్భంగా రెస్క్యూ కార్యక్రమాలు నిర్వహించడం, తమిళనాడు పోలీస్ వారి సహకారంతో చిత్తూరు జిల్లాలో అల్ఉమా సంస్థకు చెందిన ఉగ్రవాదులను అక్టోపస్ కమాండోలు అరెస్టు చేయడం, దేశంలోనే మొదటిసారిగా 21 కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన ఘనత సాధించడం మన శాంతిభద్రతల యంత్రాంగం ఇటీవల కాలంలో సాధించిన కొన్ని ముఖ్య విజయాలు.

50