పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక

47. 2021-22 సం॥లో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికకు 17,403 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపులకంటే 22.4% (14,218.76 కోట్లు) ఎక్కువ.

షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక

48. షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 6,131 కోట్ల 24 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపులకంటే 27.25% (4,814.5 కోట్లు) ఎక్కువ.

అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక

49. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధిక సంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ లక్ష్య సాధనకై డా॥ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు అల్పసంఖ్యాక వర్గాల వారికోసం 4% రిజర్వేషన్లను ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాలవారికి ఒక వరం. అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులను కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులను బడ్జెట్ లో పొందుపరచటం జరిగింది. తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది. ఇది కేటాయింపులు, ఖర్చులను కాలానుగుణంగా గుర్తించటానికి, పర్యవేక్షించడానికి తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అల్పసంఖ్యాక వర్గాలకు 3,840 కోట్ల 72 లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నాను.

24