పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలోచన. అందువలన 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.

33. పిల్లల అభివృద్ధికి మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తెలియజేయడానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను నేను గుర్తుచేస్తున్నాను.

“పిల్లలను మీ స్వంత శిక్షణ అవసరాలకు పరిమితం చేయవద్దు, వారు జన్మించిన కాలం వేరు”.

34. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల 8.7 లక్షల మంది పిల్లలలో, పౌష్టిక ఆహార సరఫరాతోపాటు, వయస్సుకి తగిన ఆలోచన, సామాజిక మరియు భావోద్వేగ వికాసానికి పునాది వేయడానికి 55,607 అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రభుత్వం 'వైయస్.ఆర్. ప్రీ-ప్రైమరీ పాఠశాలలను' ప్రవేశపెట్టింది. పిల్లల సమగ్ర అభివృద్ధికి, ఈ క్రమబద్ధమైన విధానం దేశంలోనే ఒక ప్రత్యేకమైన నమూనాగా నిలుస్తుంది. ఈ క్రొత్త విద్యావిధానం, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (S.C.E.R.T.) మద్దతుతో సవరించిన ప్రీ-స్కూల్ 'పాఠ్య ప్రణాళిక' ఆదేశాలను అనుసరిస్తుంది.

35. అంగన్‌వాడీల భౌతిక, మౌళిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, 16,681 అంగన్ వాడీలను 9 విభాగాలతో, అనగా మరుగుదొడ్లు, విద్యుత్ శక్తి, వంటగది, తాగునీరు, భవనాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డు, ప్రహరీ గోడ, ఆట పరికరాలు, సురక్షత నీటి సరఫరా సదుపాయాలతో మెరుగుపరచాలని ప్రతిపాదించడమైనది. అంతేగాక నాడు-నేడు కార్యక్రమం క్రింద, రాబోయే 3 సంవత్సరాలలో 27,428 కొత్త భవనాలను నిర్మించాలని తలపెట్టడం జరిగింది. వీటిలో 3,928 పాఠశాల భవనాల నిర్మాణం రాబోయే

17